న్యూదిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాన్షు ధూలియా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ బి పార్దివాలా సోమవారం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం అదనపు భవన సముదాయంలో కొత్తగా నిర్మాణం చేసిన ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ… న్యాయమూర్తులు ధూలియా, పార్దివాలాతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ ధూలియా, జస్టిస్ పార్దివాలా నియామకంతో ఈ ఏడాది జనవరి 4న జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి పదవీ విరమణ తర్వాత 32కి పడిపోయిన 34 మంది న్యాయమూర్తుల సంఖ్యను అత్యున్నత న్యాయస్థానం తిరిగి పొందుతుంది. కాగా జస్టిస్ పార్దివాలా రెండేళ్లకు పైగా సీజేఐగా సేవలు అందించనున్నట్లు ఉన్నత న్యాయ వ్యవస్థ సభ్యుల నియామకం గురించి తెలిసిన వర్గాలు వెల్లడిరచాయి. ఉత్తరాఖండ్ నుంచి పదోన్నతి పొందిన రెండవ న్యాయమూర్తి అయిన జస్టిస్ ధూలియా, జాతీయ అవార్డు గెలుచుకున్న చలనచిత్ర దర్శకుడు, నటుడు తిగ్మాన్షు ధూలియా సోదరుడు. ఆయన పదవీ కాలం మూడేళ్లకు పైగా ఉంటుంది.