న్యూదిల్లీ : దేశద్రోహం చట్టాన్ని నిలిపివేయాలంటూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం వెలువరించిన తీర్పు నేపథ్యంలో కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజీజూ ‘లక్ష్మణ రేఖ’ను పునరుద్ధరించారు. వేర్వేరు ఇనిస్టిట్యూట్లు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలో ఎవ్వరూ దీనిని దాటొద్దంటూ ఆదేశాలిచ్చారు. కోర్టు తీర్పు అనంతరం రిజిజూ విలేకరులతో మాట్లాడారు. ‘మేము ఒకర్నొకరం గౌరవించుకుంటాం. ప్రభుత్వాన్ని, శాసనసాలను కోర్టు గౌరవించాలి. అలాగే ప్రభుత్వం కూడా చేయాలి. మా పరిధి ఎంతో బాగా తెలుసు. ఎవ్వరూ ‘లక్ష్మణ రేఖ’ను దాటేందుకు వీల్లేదు’ అని న్యాయమంత్రి అన్నారు.