ప్రస్తుతం సెకండ్వేవ్ మధ్యలో ఉన్నామని, వైరస్ నియంత్రణలో సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ముఖ్యమైనవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.రానున్న రెండు నెలల్లో (సెప్టెంబర్, అక్టోబర్) పలు పండుగలు ఉన్నాయి..కాబట్టి మనం ఈ పండుగలను కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ జరుపుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. లేకుంటే వైరస్ వేగంగా వ్యాప్తి చెంది కరోనా కేసులు పెరిగే ప్రమాదముందని హెచ్చరించారు.గతంలో ప్రతి పండుగ అనంతరం కేసులు పెరిగిన సంగతి మరువద్దన్నారు. దేశంలో 41 జిల్లాల్లో కరోనా వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉన్నదన్నారు. గతవారంలో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు (58.4 శాతం) కేవలం కేరళలోనే వెలుగుచూశాయని రాజేశ్ భూషణ్ వెల్లడిరచారు. కాగా కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని కేంద్రప్రభుత్వం తగ్గించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రంలోని అత్యున్నత అధికారుల స్థాయిలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. అయితే, ఎన్టీఏజీఐ చీఫ్ ఎన్కే అరోరా ఈ వార్తలను కొట్టిపారేశారు.