Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్కూల్‌ పాఠ్యాంశంగా పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవితచరిత్ర

కర్ణాటకలోని స్కూల్‌ సిలబస్‌లో కర్ణాటక రత్న, పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. పునీత్‌ రాజ్‌కుమార్‌ జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో తాము ఆ దిశగా ఆలోచన చేస్తున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చెప్పారు.పునీత్‌ రాజ్‌కుమార్‌ వందలాది మంది నిరుపేద విద్యార్థులను, అనాధలను తన సొంత ఖర్చుతో చదివించి గొప్ప మానవతామూర్తిగా నిలిచారని, ఆయన జీవితచరిత్ర నుంచి విద్యార్థులు స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని కర్ణాటకకు చెందిన పలువురు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. పునీత్‌ రాజ్‌కుమార్‌ నేత్రదానాన్ని, స్వయం ప్రేరిత రక్తదానాన్ని పోత్సహించారని, ఎన్నో వృద్ధాశ్రమాలకు అండగా నిలిచారని వారు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img