స్కూల్ విద్యార్థిని ఢీకొట్టి ఆపకుండా కారుతో ఈడ్చుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రైవర్ను స్థానికులు చితక్కొట్టారు. ఆ కారును ధ్వంసం చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో జరిగింది.శుక్రవారం సాయంత్రం 9వ తరగతి చదువుతున్న కేతన్ కుమార్ సైకిల్పై ట్యూషన్కు వెళ్తున్నాడు. తెల్లని వ్యాగనార్ అతడి సైకిల్పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆ విద్యార్థి కాలు కారు వెనుక చక్రం భాగంలో ఇరుక్కున్నది. అయినప్పటికీ డ్రైవర్ కారును ఆపలేదు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు కారును వేగంగా డ్రైవ్ చేయగా ఆ బాలుడ్ని అది ఈడ్చుకెళ్లింది. మరోవైపు గమనించిన స్థానికులు కారు ఆపాలని కేకలు వేస్తూ దాని వెంటపడ్డారు. అయినప్పటికీ డ్రైవర్ ఆ వాహనాన్ని ఆపకపోగా వీధుల్లో వేగంగా నడిపాడు. అయితే జనం రద్దీగా ఉండే చోట ఆ కారును కొందరు అడ్డుకుని డ్రైవర్ను కర్రలతో చితక్కొట్టారు. కారును ఒకవైపు తోసి ధ్వంసం చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు జనం బారి నుంచి డ్రైవర్ను కాపాడి అరెస్ట్ చేశారు. గాయపడిన విద్యార్థి కేతన్ కుమార్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఢల్లీి తరహాలో జరిగిన ఈ సంఘటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.