Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

స్పృహ తప్పిన మహా మంత్రి

ముంబై: మహారాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) నేత ధనుంజయ్‌ ముండే అకస్మాత్తుగా స్పృహ తప్పడంతో ఆయనను ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ బుధవారం ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆందోళన పడాల్సిన పనిలేదని, సాయంత్రానికి కల్లా ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మారుస్తారని చెప్పారు. ఆయనకు గుండెపోటు రాలేదని, స్పృహతప్పడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారని చెప్పారు. ముండే ఇటీవల రెండుసార్లు కరోనా బారిన పడ్డారు. 2020 జూన్‌, 2021 మార్చిలో ఆయనకు కరోనా పాజిటివ్‌ రావడంతో చికిత్స అనంతరం కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img