Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

స్లోవేకియా నుంచి దిల్లీకి 370మంది విద్యార్థులు

న్యూదిల్లీ: ఉక్రెయిన్‌లోని స్లోవేకియా నుంచి సుమారు 370 మంది విద్యార్థులను రెండు విమానాల్లో గురువారం దిల్లీకి తరలించినట్టు కేంద్రమంత్రి కిరణ్‌ రిజీజు తెలిపారు. ‘ఆపరేషన్‌ గంగ’లో భాగంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని చేపట్టగా, న్యాయమంత్రి కిరణ్‌ రిజీజు ప్రస్తుతం కొసైస్‌లోని స్లోవేకియన్‌ నగరంలో విద్యార్థుల తరలింపును పర్యవేక్షిస్తున్నారు. ‘గురువారం మేం రెండు విమానాల్లో కొసైస్‌నుంచి 370మంది విద్యార్థులను తరలించాం’ అని రిజీజు తెలిపారు. అంతకుముందు రిజీజు అక్కడ చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడారు. వారంతో కొసైస్‌లోని హోటళ్లలో తలదాచుకున్నారు. వారికి ఉక్రెయిన్‌ ప్రభుత్వం సౌకర్యాలను సమకూర్చింది. తామంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, సాధ్యమైనంత తొందరగా అందరినీ తరలించాలని వారు మంత్రిని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img