: ప్రధాని మోదీ
దేశ ప్రగతిని అడ్డుకునేందుకు పార్లమెంట్లో ప్రతిపక్షాలు శతవిధాల ప్రయత్నిస్తున్నాయని, ప్రతిపక్షాల తీరును ప్రజలు సహించరని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీమ్తో ప్రయోజనం పొందిన లబ్ధిదారులతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన మాట్లాడారు. హాకీలో మనోళ్లు గోల్స్ చేస్తుంటే అందరూ సెలబ్రేట్ చేసుకున్నారని, అయితే కొందరు మాత్రం సెల్ప్ గోల్ చేసుకుంటున్నారన్నారు. పార్లమెంట్ను ఎంత అడ్డుకున్నా స్వార్థపరుల రాజకీయాలకు తలొగ్గేదిలేదన్నారు.