హర్యానాలోని సిర్సాలో శనివారం రైతులు మళ్లీ తీవ్ర ఆందోళనను దిగారు. వీరిని అడ్డగించేందుకు పోలీసులు పెట్టిన బ్యారికేడ్లను విరగొట్టారు. తమ సహచరులపై పెట్టిన దేశద్రోహం కేసులను ఉపసంహరించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ..ఈ జిల్లాలో పోటెత్తారు. ఈ నెల 11 న బీజేపీ నేత, హర్యానా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రణదీప్ గాంగ్వా కారుపై దాడి జరిపి కారు అద్దాలను రైతులు పగులగొట్టారు..ఆయన కాన్వాయ్ ని అడ్డగించి వెనుతిరిగిపోవాలంటూ నినాదాలు చేశారు.ఆ సందర్భంగా పోలీసులు 100 మంది అన్నదాతలపై దేశద్రోహం కేసులు పెట్టారు. అయిదుగురు రైతులను అరెస్టు చేశారు.