హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 400 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నమోదవుతున్నది. ఈ ఉదయం 11 గంటల వరకు దాదాపు 18 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. %కాగా, ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అత్యంత కురువృద్ధురాలైన బామ్మ నారోదేవి (105) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ స్థానంలోని పోలింగ్ స్టేషన్ 122లో ఆమె ఓటు వేశారు.