దేశవ్యాప్తంగా కేవలం శుక్రవారం ఒకరోజులోనే 2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చి, రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. గోవాలో నూటికి నూరు శాతం తొలి డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం గోవాలోని వైద్యులు, హెల్త్ వర్కర్లు, ఇతర ఫ్రంట్లైన్ వర్కర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించారు. గోవా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డాక్టర్ నితిన్ ధూప్డలేతో ప్రధాని మాట్లాడుతూ..కాంగ్రెస్ను పరోక్షంగా ప్రస్తావించారు. ప్రతి వంద వ్యాక్సినేషన్లకు ఒకరిద్దరు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్తూ ఉంటారు. నిన్న 2.5 కోట్ల డోసులను వేయగలిగాం. బహుశా ప్రపంచంలో ఒక రోజులో ఇది అత్యధికం కావచ్చని అన్నారు. అయితే నిన్న అర్ధరాత్రి ఈ లెక్కలను ప్రకటించిన తర్వాత ఓ రాజకీయ పార్టీ కొంత ప్రతికూల ప్రతిస్పందనను కనబరచడం ప్రారంభించింది.. దీనిలో తర్కం ఉందా?’ అని అడిగారు. డాక్టర్ నితిన్ మాట్లాడుతూ, ప్రజలకు తాము ఇవ్వబోతున్న టీకా గురించి వివరించి చెప్పామని, ఆ వ్యాక్సినేషన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పామని అన్నారు. ఒకవేళ వ్యాక్సిన్ రియాక్షన్ వస్తే వెంటనే తమను సంప్రదించాలని హెల్ప్లైన్ నంబరును ఇచ్చామని చెప్పుకొచ్చారు.