Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను తొలగించండి

: రాహుల్‌గాంధీ
లఖింపూర్‌ ఘటన కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ కేసులో మంత్రి అజయ్‌ను తొలగించాలంటూ ఆయన ఇవాళ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. మంత్రి అజయ్‌ మిశ్రాను క్యాబినెట్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తామని లోక్‌సభ విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ తెలిపారు. ముందస్తు కుట్రతోనే రైతులపైకి వాహనాన్ని తొక్కించినట్లు సిట్‌ దర్యాప్తు సంచలన విషయం వెల్లడిరచింది. ఈ ఘటన విషయంలో మరోసారి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్‌గాంధీ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img