న్యూదిల్లీ: దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. దిల్లీలో 11 ఏళ్లలో ఏప్రిల్లో అత్యధిక ఉష్ణోగ్రత 42.6 డిగ్రీ సెల్సియస్ వద్ద నమోదైందని ఐఎండీ పేర్కొంది. దిల్లీలోని సఫ్దర్జంగ్ అబ్జర్వేటరీలో మంగళవారం 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఇది గత 11 ఏళ్లలో ఏప్రిల్లో అత్యధికంగా నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది 2010లో ఏప్రిల్లో ఒక రోజులో ఆల్-టైమ్ అత్యధిక ఉష్ణోగ్రత 46.5 డిగ్రీ సెల్సియస్ వద్ద నమోదైంది. దిల్లీలోని ఎనిమిది స్టేషన్లలో వేడిగాలులు వీచాయని, తీవ్రమైన వేడి పరిస్థితులు నెలకొన్నాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ 19 మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైందని, ఇది సీజన్లో అత్యంత వెచ్చని రోజుగా మారిందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దేశ రాజధాని దిల్లీలో బుధవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడిరచింది.