కొవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇవాళ్టికి దేశ వ్యాప్తంగా 112.34 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో కోవిడ్ రికవరీ రేట్ 98.26శాతం ఉందని, కొత్తగా గత 24గంటల్లో 229 కేసులు నమోదయింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,34,096 వుంది. గత 52 రోజుల్లో వీక్లీ పాజిటివ్ కేసుల సంఖ్య 52(0.99శాతం)గా నమోదయ్యింది.