మధ్యప్రదేశ్లో నిరుద్యోగ సమస్య పట్టిపీడిస్తోంది. 15 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ కాగా దాదాపు 11,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాలకు విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత కాగా, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజినీర్లు, ఎంబీఏ చదివినవారు, సివిల్ జడ్జి ఉద్యోగం కోసం పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నవారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారు. దరఖాస్తుదారుల్లో పొరుగు రాష్ట్రం ఉత్తర ప్రదేశ్వారు కూడా ఉన్నారు.