Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

16న తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం

పతనంతిట్ట (కేరళ) : రెండు నెలల పాటు జరిగే వార్షిక తీర్థయాత్ర సీజన్‌ కోసం నవంబరు 16న శబరిమల ఆలయం తెరుచుకోనుంది. ఈ సమయంలో రోజుకు 30,000 మంది భక్తులు వర్చువల్‌ క్యూ సిస్టమ్‌ ద్వారా స్వామి దర్శనానికి అనుమతించబడతారని అధికారులు శుక్రవారం ఇక్కడ తెలిపారు. నవంబర్‌ 16న తీర్థయాత్ర ప్రారంభం కానుంది. గర్భ గుడిని ప్రధాన అర్చకుడు (తంత్రి) కందరారు మహేశ్‌ మోహనరావు సమక్షంలో నవంబర్‌ 15న సాయంత్రం 5 గంటలకు పదవీ విరమణ చేసిన పూజారి వీకే జయరాజ్‌ పొట్టి తెరవనున్నారు. ఆ తర్వాత అయ్యప్ప స్వామి, మలికప్పురం ఆలయాలకు కొత్తగా ఎంపికైన అర్చకుల నియామక కార్యక్రమం జరగనుంది. కోవిడ్‌-19 ప్రోటోకాల్‌కు కట్టుబడి ఈ తీర్థయాత్ర నిర్వహిస్తున్నారు. శబరిమల క్షేత్రాన్ని సందర్శించాలనుకునే వారికి రెండు డోసుల కోవిడ్‌ వాక్సినేషన్‌ సర్టిఫికేట్‌ లేదా 72 గంటలలోపు తీసుకున్న కోవిడ్‌`19 నెగటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి. భక్తులు ఒరిజినల్‌ ఆధార్‌ కార్డులను కూడా చూపించాలని ఆలయ అధికారులు తెలిపారు. బేస్‌ క్యాంపు నిలక్కల్‌లో ఉంటుంది. నిలక్కల్‌ వద్ద స్పాట్‌ వర్చువల్‌ క్యూ బుకింగ్‌ సౌకర్యం ఉంటుంది. పంపాలో వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదు. అయితే, పంపా నదిలో భక్తుల పుణ్య స్నానాలను అనుమతిస్తారు. పంపా సన్నిధానంలో ఉండేందుకు యాత్రికులను అనుమతించరు. దర్శనం పూర్తి చేసుకున్న వారు ప్రాంగణం నుంచి బయటకు రావాలి. స్వామి అయ్యప్పన్‌ రోడ్డు గుండా మాత్రమే ఆలయానికి ట్రెక్కింగ్‌ను అనుమతిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img