2022 ఆగస్టు నాటికి నూతన పార్లమెంట్ భవనం నిర్మాణ పనులు ముగిసేలా చర్యలు చేపడుతున్నట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం ఓం బిర్లా విలేకరులతో మాట్లాడుతూ, స్వాతంత్యం సిద్దించి 75 ఏండ్లు పూర్తయ్యే సందర్భంలో నూతన పార్లమెంట్ భవనం సిద్ధం కానుందని చెప్పారు. సమావేశాల్లో సభ కేవలం 21 గంటలే సజావుగా నడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోక్సభలో పరిణామాలు తనను బాధించాయని స్పీకర్ ఆందోళన వ్యక్తంచేశారు.