కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్గా లేని 253 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 25 పార్టీలు రద్దు.. అందులో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిష్టర్ అయ్యాయి. అందులో చాలా పార్టీలు ఇప్పుడు యాక్టివ్గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. క్రియాశీలకంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఎన్నికల ప్రజాస్వామ్యం స్వచ్ఛత కోసం, విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం తక్షణ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అవసరం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టుగా వెల్లడిరచింది. ఎన్నికల చిహ్నాల ఉత్తర్వు- 1968 ప్రకారం.. ఈ పార్టీలు ఎలాంటి ప్రయోజనం పొందకుండా కూడా కమిషన్ నిషేధించింది. రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి ఆల్ ఇండియా ముత్తాహిత ఖ్వామీ మహజ్, ప్రజా భారత్ పార్టీ, మనపార్టీ, భారతదేశం పార్టీ, ఇండియన్స్ ఫ్రంట్, జాతీయ తెలుగు అభివృద్ది సేవాల సమూహం.. తెలంగాణ నుంచి సురాజ్ పార్టీ, సెక్యులర్ డెమొక్రటిక్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. పార్టీ పరమైన ప్రయోజనాలు పొందకుండా నిషేధం విధించిన జాబితాలో తెలంగాణలో 14 పార్టీలు ఉన్నాయి. అందులో క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్కు చెందిన ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది.