Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

296 కిలోమీటర్ల బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో సుమారు 296 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్‌వేను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి చెందిన 7 జిల్లాలను కలుపుతూ 296 కిలో మీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. 6 లేన్లతో ఏర్పాటైన ఈ రహదారికి కేంద్రం ఏకంగా రూ.14,850 కోట్లను వెచ్చించింది. ఈ కొత్త రహదారికి చెందిన ఫొటోలు, వీడియోలు గడచిన రెండు, మూడు రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మితమైన ఈ రహదారితో బుందేల్‌ఖండ్‌ రూపు రేఖలే మారిపోతాయని మోదీ సర్కారు చెబుతోంది. ఈ రహదారితో బుందేల్‌ఖండ్‌ పారిశ్రామికంగానే కాకుండా ఆయా ప్రాంతాలతో మరింత మెరుగైన వ్యాపార బంధాలు నెలకొనే అవకాశాలున్నాయని కేంద్రం చెబుతోంది. ఈ రహదారిని మోదీ ప్రారంభించిన వీడియోను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img