ముంబై: మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ముంబై ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 4 వరకు పొడిగించింది. అయితే ఆయనకు మంచం, పరుపు, చైర్ ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంత్రి నవాబ్ మాలిక్ను ఫిబ్రవరి 23న అరెస్ట్ చేసింది. తొలుత ఆయన ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు అనేక గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.ఆ తర్వాత ఈడీ ప్రత్యేక కోర్టులో నవాబ్ మాలిక్ను హాజరుపర్చారు. 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును ఈడీ కోరింది. తొలుత మార్చి 3 వరకు ఈడీ రిమాండ్కు కోర్టు అంగీకరించింది. ఆ తర్వత మరోసారి ఈడీ కస్టడీని పొడిగించింది. ఈడీ కస్టడీ ముగిసిన నాటి నుంచి నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు. తాజాగా దీనిని ఏప్రిల్ 4 వరకు కోర్టు పొడిగించింది.