Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

7 నుంచి భారత్‌ జోడో యాత్ర..

కాంగ్రెస్‌ పార్టీ బుధవారం నుంచి భారత్‌ జోడో యాత్ర పేరుతో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు. సుమారు 3570 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర ఉంటుంది. ఆర్థిక అసమానతలు, సామాజిక వివక్ష, రాజకీయ వికేంద్రీకరణ లాంటి అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ ఈ యాత్రలో అవగాహన కల్పించనున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు శ్రీపెరంబదూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్‌కు రాహుల్‌ నివాళి అర్పిస్తారు. ఇక ఆ తర్వాత కన్యాకుమారిలో జరిగే కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారు. దీంట్లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, చత్తీస్‌ఘడ్‌ సీఎం భూపేశ్‌ భగల్‌ కూడా పాల్గొంటారు. మిలే కదం, జుడే వతన్‌ ట్యాగ్‌లైన్‌తో యాత్రను నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img