విమానయాన సంస్థ స్పైస్జెట్ తన పైలట్లకు షాకిచ్చింది. జీతాలివ్వకుండానే 80 మంది పైలట్లను సెలవుపై ఇంటికి పంపేసింది. ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ చేపట్టిన తాత్కాలిక చర్యల్లో భాగంగా ఈ పైలట్లను ఇంటికి పంపేసినట్టు తెలిసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇన్వెస్టర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో బుధవారం స్పైస్జెట్ షేర్లు ట్రేడిరగ్ ప్రారంభంలోనే 3.5 శాతం మేర కుప్పకూలాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండెక్స్లో స్పైస్జెట్ షేర్లు టాప్ 5 లూజర్లలో ఒకటిగా ఉన్నాయి.ఇటీవల స్పైస్జెట్ తీసుకుంటోన్న నిర్ణయాలు ఆ కంపెనీ షేరుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో పాటు స్పైస్జెట్ విమానాల్లో టెక్నికల్ లోపాలు వార్తల్లో ప్రధానాంశంగా నిలుస్తున్నాయి. స్పైస్జెట్ ఎయిర్క్రాఫ్ట్లలో టెక్నికల్ లోపాలున్నాయనే కారణంతో 8 వారాలలో 50 శాతం మేర విమానాలను డీజీసీఏ రద్దు చేసింది. ఈ 8 వారాల పాటు స్పైస్జెట్ ఎయిర్లైన్ సంస్థపై తాము అదనపు నిఘా పెట్టనున్నామని డీజీసీఏ తెలిపింది. స్పైస్జెట్ కంపెనీకి మొత్తంగా 90 ఎయిర్క్రాఫ్ట్లున్నాయి.