Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

95 శాతం ప్రజలకు బీజేపీతో పనిలేదు : అఖిలేశ్‌

లక్నో : 95శాతం ప్రజలకు పెట్రోల్‌, డీజిల్‌తో పనిలేదన్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఉపేంద్ర తివారీ వ్యాఖ్యలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేశ్‌ యాదవ్‌ స్పందించారు. అసలు జనాలకు బీజేపీతోనే పనిలేదన్నారు. గురువారం తివారీ మాట్లాడుతూ పెట్రోలు, డీజిలు ధరలు తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెద్దగా పెరగలేదని, అసలు 95శాతం మంది జనాలకు వాటితో అవసరమే లేదని వ్యాఖ్యానించారు. ఈ వాఖ్యలపై స్పందించిన సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘రైతులను హత్యచేసేందుకు బీజేపీ నాయకులు ఉపయోగించిన జీప్‌ (మహింద్రా థార్‌)కు బహుశా డీజిల్‌ అవసరం లేదేమో’ అని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img