పార్లమెంట్ కు ర్యాలీగా వెళుతున్న సందర్భంగా దమ్ముంటే తమపై కాల్పులు జరపాలని పోలీసులతో రెజ్లర్ పునియా అన్నారన్న వార్తలపై స్పందిస్తూ రిటైర్డ్ ఐపీఎస్, కేరళ పోలీస్ మాజీ చీఫ్ ఎన్ సీ ఆస్తానా ట్వీట్ చేశారు. ాాఅవసరమైతే మీపై కాల్పులు జరుపుతారు. అంతేతప్ప మీరు చెబితే కాదు. ఒక బస్తా చెత్తను పడేసినట్లే , మిమ్మల్ని లాగి పడవేస్తాం. సెక్షన్ 129.. పోలీసులకు కాల్చులు జరిపే అధికారాన్ని ఇస్తుంది. పరిస్థితులు డిమాండ్ చేస్తే ఆ ాకోరిక్ణ నెరవేరుతుంది. అందుకే మీరు చదువుకుని ఉండాలి. పోస్ట్మార్టం టేబుల్పై మళ్లీ కలుద్దాం్ణ్ణ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ ట్వీట్ పై బజరంగ్ పునియా స్పందించారు. ాామమ్మల్ని కాల్చిచంపడం గురించి ఈ ఐపీఎస్ అధికారి మాట్లాడుతున్నారు. సోదరా.. మేం మీ ముందే ఉంటాం. ఎక్కడికి రావాలో చెప్పు. మీ బుల్లెట్లకు మా చాతీని చూపుతామని మీకు ప్రమాణం చేస్తున్నా. బుల్లెట్లు మినహా మిగతావన్నింటినీ రెజ్లర్లు ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది అవొక్కటే.. తీసుకురండి్ణ్ణ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.