సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్
విశాలాంధ్ర బ్యూరో` నెల్లూరు : రాష్ట్రాన్ని ఆర్థికంగా కుంగ తీసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ అన్నారు. బుధవారం నెల్లూరులోని రామకోటయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలోఆయనమాట్లాడుతూఆంధ్రాష్ట్రంలోని డ్రగ్స్ మాఫియానుఅరికట్టండి, మా%శీ%డోస్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని , అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు నెలసరి వేతనాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగదీష్ అన్నారు. దేశంలో మన రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ మాఫియా చెలరేగుతుంది కోస్టల్ కారిడార్ ఏరియా అదేవిధంగా పోర్టులు కేంద్ర ప్రభుత్వం ఆదానికి అంకితం చేయడం ద్వారా డ్రగ్స్ మాఫియా పేట్రేగిపోతుంది. ఈ మాఫియాని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లాది డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది ఈ మాఫియా ను అరికట్టకపోతే ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని జగదీష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కుంటుపడిరదంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పోరాటానికి సిపిఐ బాసటగా నిలుస్తుందని జగదీష్ తెలిపారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్లాది రూపాయల టెండర్లను నామినేటెడ్ పద్ధతిలో వారి పార్టీ కార్యకర్తల అందచేయటాన్ని జగదీష్ తీవ్రంగా ఖండిరచారు. రైతు సంఘం జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ మండుస్ తుఫాన్ వల్ల రైతాంగం పండిరచిన పంటలు పూర్తిగా నష్టపోయారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకోవాలి అదేవిధంగా సామాన్య ప్రజలు కూడా నష్టపోయారు. మీరందరినీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటికే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో బిజెపి తిరిగి ప్రచారం చేసిన గెలుపు నామమాత్రంగానే ఉందని అదేవిధంగా జరిగినటువంటి పలు ప్రాంత పలు రాష్ట్రాల శాసనసభ పార్లమెంటు ఎన్నికలలో బిజెపి అభ్యర్థులు పూర్తిగా వైఫల్యం చెందారు అని వెంకయ్య తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దామాంకయ్య, మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల సంబంధించినటువంటి తుఫాను వర్షాల వలన పలు ప్రాంతాలలో రైతులకు పూర్తిగా దెబ్బతిన్నారని అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని కందుకూరు ఆత్మకూరు కావలి ఉదయగిరి ప్రాంతాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన భూములను రామాయపట్నం పోర్టు నిర్మాణం పేరుతో కారు శివకోగా కొనుగోలు చేయడమే కాకుండా వారికి తగినటువంటి జీవనోపాధి చూపకుండా చేస్తున్నారని ఆయన అన్నారు జిల్లాకు చెందిన మంత్రి ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరుగుతుందని అన్నారు. అంతకుమునుపు జిల్లా కార్యవర్గ సమావేశంలో రావుల వెంకయ్య డి జగదీష్ లు పాల్గొని జిల్లాలో వాటిని ప్రజా సంఘాలను పటిష్ట చేయాలని అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులంతా పార్టీ ప్రజాసంఘాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వారు సూచించారు.