Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి

విశాలాంధ్ర -ఓజిలి: మండల కేంద్రమైన ఓజిలి పంచాయితీ ఆఫీస్ సెంటర్లో ఉన్న ఉమ్మడి రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓజిలి ఉప సర్పంచ్ ముమ్మడి సుబ్బారావ్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అదేవిధంగా రైతు బాంధవుడుని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదర్తి హరినాథ్ రెడ్డి, కొండూరు దామోదర్ రాజు, మైనార్టీ సెల్ నాయకులు జానీ బాష కో ఆప్షన్ సభ్యులు ఖాదర్ భాషా, కాకాని రవి పలువురు నాయకులు, వాలెంటర్ల్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img