Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఏలూరుపాడు బ్రిడ్జిపై ట్రాక్టర్ ను ఢీకొన్న లారీ

విశాలాంధ్ర – గుడ్లూరు: మండలంలోని ఏలూరుపాడు బ్రీడ్జీ వద్ద ముందు వెళుతున్న ట్రాక్టర్ ను వెనుకవైపు నుండి లారీ ఢీకొన్న ప్రమాదం బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలలోనికి వెళితే సింగరాయకొండ వైపు నుండి కావలి వైపు చవక మొద్దుల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ఏలూరుపాడు రైల్వే బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి వెనుకవైపు నుండి వస్తున్న లారీ ట్రాక్టర్ ట్రక్కును బలంగా ఢీకొంది. దీనితో ట్రాక్టర్ బ్రిడ్జి గోడను ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ చాలా భాగం దెబ్బతినగా, వాహన చోదకులకు ఎటువంటి గాయాలు తగలలేదు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదం జరిగినప్పుడు లారీని ప్రధాన డ్రైవర్ తోలకుండా క్లినర్ లారీ నడుపుతున్నట్టు సమాచారం. ఇది వాస్తవమో, కాదో దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీస్ విచారణలో తేలనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img