విశాలాంధ్ర – ఈ రోజు తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు మరియు రూరల్ నియోజకవర్గ ఇంచార్జి అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాలు మేరకు నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి.గంగాధర్ ఆధ్వర్యంలో 23 వ డివిజన్ నందు నెల్లూరు పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు గోడ.పద్మ, సీనియర్ నాయకులు సికారి.భాస్కర్ పార్లమెంట్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు అల్లా భక్షు లతో కలిసి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు
ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ కార్యదర్శి కనపర్తి.గంగాధర్ మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిననాటి నుండి ప్రజల రక్తం తాగడమే పనిగా పెట్టుకుందని,విద్యుత్ చార్జీలు ఏడు సార్లు పెంచి బీద ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నారని,గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసారని,ఈ రోజు పప్పు,ఉప్పు,నూనె ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో బీదప్రజలు పట్టెడన్నం కడుపునిండా తినలేని దైన స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని,చెత్త పై పన్ను విధించడం దారుణమని చెత్త పన్ను రద్దుచేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని,ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేందు ప్రజలు సిద్ధంగా ఉన్నారని,ఈ బాదుడే బాదుడు కార్యక్రమానికి ఎక్కడికెళ్లినా అపూర్వమైన స్పందన వస్తుందని ప్రతిపక్షం లో ఉన్నప్పుడు మేము బీదలపక్షం అని ఓట్లెయించుకొన్న ఈ శాసనసభ్యులు ప్రజలు ఇంత ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఇప్పుడు ఏమయ్యారో తెలియట్లేదని,ఇంతటి ప్రజా వ్యతిరేక విధానాలను అమలుపరిస్తున్నా ఒక్క రోజైన శాసనసభలో ప్రస్తావించలేక పోవడందురదృష్టకరమని,జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే ధైర్యం ఈ శాసనసభ్యులకు లేదని దయ్యబట్టారు
ఇంకా ఈ కార్యక్రమంలో సికారి.సుధమ్మ,ప్రభావతి,జయమ్మ,ఏలయ్య,కావేరి,కుమారమ్మ,రత్నమ్మ, శారదమ్మ తదితరులు పాల్గొన్నారు.