Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మానసిక వికలాంగుల మధ్య బర్త్ డే

నెల్లూరు : జన్మదిన వేడుకలను ఆర్భాటంగా నిర్వహించుకునే సాంప్రదాయానికి భిన్నంగా భగవంతుని శాపానికి గురైన బాధార్తుల మధ్య నిర్వహించుకోవడం విశేషమని వర పరివార్ సేవ ఫౌండేషన్ ఛైర్మన్ మాధవి పేర్కొన్నారు. ఆమె ఆధ్వర్యంలో డాక్టర్ గడ్డం ప్రసన్నలక్ష్మి పుట్టినరోజును అయ్యప్ప గుడి దగ్గర ఉన్న ప్రగతి చారిటీస్ మానసిక వికలాంగుల ఆశ్రమం నందు మంగళవారం ఘనంగా నిర్వహించారు. మానసిక వికలాంగుల మధ్య తమ శుభం కార్యాలు నిర్వహించుకోవడం వలన వారిలో నిరాశ నిస్పృహ లు తొలిగి ఆత్మ స్థైర్యం ఏర్పడుతుందని మాధవి పేర్కొన్నారు. డాక్టర్ గడ్డం ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ మాధవి సూచనతో మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుక తనకు కొత్త అనుభూతిని కలిగించిందని, వారి ఆనందం లో భగవంతుని చూసే భాగ్యం కలిగిందని అన్నా రు. మాధవి ఆధ్వర్యంలో వరపరివార్ చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుకన్య ,చందు సత్య ,మోహన్, శివాని, మనోహర్, వాహిద్, దస్తగిరి, శ్యామల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img