Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చంద్రబాబు, లోకేష్ ప్రజాదరణ చూడలేకే దాడులు

ఏలూరు: టిడిపి అధినేత చంద్రబాబు, యువనేత లోకేషలకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ముఖ్యమంత్రి జగన్ కి నిద్రపట్టడం లేదని, అందుకే వైసిపి రౌడీలు, అల్లరిమూకలతో అన్నిచోట్ల అలజడి సృష్టించాలని కుట్రలు పన్నుతున్నాడని ఏలూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంఛార్జి బ‌డేటి చంటి అన్నారు. స్థానిక 13,15 వ డివిజన్ వెంకన్న చెరువు దగ్గర ప్రశాంత్ కాలనీ వ‌ద్ద ప్రారంభమైన ప్రజా చైతన్యయాత్రలో ఆయ‌న పాల్గొని ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ కుప్పంలో వైసిపి గుండాలు విధ్వంసం సృష్టించటం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు.ప్రశాంతతకు మారుపేరైన ఎపిని అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని చూస్తున్న వైసిపి ని తరిమికొట్టే సమయం దగ్గర పడుతోందన్నారు. కొంతమంది పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఒకవేళ అధికారపార్టీ ఆగడాలను అడ్డుకోవడంలో పోలీసులు భయపడుతుంటే వైసిపి గుండాల సంగతి తేల్చటం టిడిపి నాయకులు, కార్యకర్తలకు నిమిషం పని అని బడేటి చంటి హెచ్చరించారు. టిడిపికి 60లక్షల మంది కార్యకర్తల బలం ఉందన్న విషయం ప్రతిఒక్కరు గుర్తు పెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించినా, భయబ్రాంతులకు గురిచేసినా రాష్ట్రంలో గెలుపు టిడిపిదేనన్నారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని బడేటి చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో డివిజన్ ఇంఛార్జి కూన మాణిక్యం, క్లస్టర్ ఇంఛార్జి చోడే వెంకటరత్నం, సేనాపతి పద్మ, గడసెల సత్యనారాయణ, చంద్రం, దేవేంద్ర, వాసు, సూరిబాబు, వంగలపూడి పోతురాజు, నిడిగట్టు నాగరాజు, నిడిగట్టు సుధీర్, అమ్మోరు బాబు, ఆడారి సత్తిబాబు, అప్పారావు, అమిరిపల్లి భాస్కర్, సత్యనారాయణ, గుర్రం చిన్నా, దొడ్డా గణేష్, చింతల దుర్గారావు, గంటా బాబా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img