Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

చిల్డ్రన్స్ పార్క్ పరిశీలించిన కమిషనర్

విశాలాంధ్ర, నెల్లూరు (కార్పొరేషన్) : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ పార్కును కమిషనర్ హరిత అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. పార్కులో ఇటీవల కూలిపోయిన ప్రహరీ గోడను వేగవంతంగా నిర్మించాలని ఆదేశించారు. పార్కులోని క్యాంటీన్, స్విమ్మింగ్ పూల్, మ్యూజికల్ ఫౌంటెన్, యోగా కేంద్రం పరిశీలించి వివిధ సూచనలు జారీచేశారు. అనంతరం స్థానిక బోడిగాడి తోటలోని డంపింగ్ యార్డ్ నిర్వహణ, విద్యుత్ దహన వాటిక నిర్మాణాన్ని కమిషనర్ పరిశీలించారు. స్థానిక ఆదిత్య నగర్ లోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, కంపోస్ట్ ప్లాంట్ లను కమిషనర్ పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు సంపత్ కుమార్, సంజయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img