అనుమసముద్రంపేట : జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి వేడుకలు ఎస్ పేటలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో ఎం భాస్కర్ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ ల జయంతి వేడుకలు నిర్వహించడమైనది. వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంపీడీవో భాస్కర్ మాట్లాడుతూ భారత దేశానికి ఒక ఘనమైన జెండా ఉండాలన్న తలంపుతో జాతీయ జెండాను రూపొందించారని తెలిపారు అదేవిధంగా దేశానికి సేవ చేసిన వారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం లో పింగళి వెంకయ్య బళ్ళారి రాఘవ చూపిన చొరవ వారి గురించి పలు గేయాలు పాడి వినిపించారుఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి భాస్కర్, పరిపాలనధికారి శ్రీనివాసరావు, హెడ్స్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు వి వెంకటేశ్వర్లు, కార్యాలయం సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.