Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మెస్ చార్జీలు పెంచి, మౌళిక వసతులు కల్పించండి

టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల

విశాలాంధ్ర – కోవూరు : రాష్ట్ర ములో పలు ప్రభుత్వకళాశాల విద్యార్థులు మెస్ చార్జీలు పెంచి, మౌళిక వసతులు కల్పన కు వైస్సార్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నెల్లూరు టీడీపీ, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి అన్నారు, శనివారం, కోవూరు లో టీడీపి కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో, ఈసందర్బంగా మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో 82GO, ప్రకారం పెంచిన మెసేచార్జీలుతోనే సరి పెట్టుకొని కాలయాపన చేస్తూ, ఈరోజు అధిక ధరలుకు మెనూ ప్రకారం, ఏ నిత్య అవసరవస్తువులు కొనలేని పరిస్థితి ఉంటే, జగన్ సర్కారు మెస్ చార్జీలు పెంపు పట్ల, అలసత్వం వహిస్తూ, స్టూడెంట్స్ ను, ఇబ్బంది పెట్టి, సంపూర్ణ ఆహారం అందక, అలమటిస్తున్న కూడ, పట్టించుకోరు, పైగా, విజలెన్స్సీ అధికారులతో దాడులు, దీనికి తోడు, మౌళిక వసతులు కొరత, ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ముఖ్య మంత్రి చొరవ తీసుకొని, మెస్ పెంచాలని చేజర్ల డిమాండ్ చేసారు, ఈ కార్యక్రమం లో, జొన్నాదుల రవి కుమార్, కలికి సత్యనారాయణ, sk, నజీర్, చల్లా మురళి కృష్ణ, తాళ్లపాకలక్షయ్య, భగవాన్ SD, సయ్యద్, దువూరు రంగారెడ్డి, మారుబోయిన వెంకటేశ్వర్లు, ఇంటూరు విజయ్, జక్కంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img