Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

తెట్టులో దశదినకర్మకు హాజరైన ఇంటూరి నాగేశ్వరరావు

విశాలాంధ్ర – గుడ్లూరు: మండలంలోని తెట్టు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు యర్రంశెట్టి వెంకటేశ్వర్లు తల్లి గారైన బుజ్జమ్మ ఇటీవల మరణించారు. బుధవారం ఆమె దశదినకర్మ జరుగగా, కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు గారు హాజరై బుజ్జమ్మకు నివాళులర్పించారు. ఆమె కుమారులు వెంకటేశ్వర్లు, కుమార్, శేఖర్ లను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మద్దసాని శ్రీను, స్థానిక నాయకులు షేక్ పెదబాబు, షేక్ బుజ్జి, షేక్ సున్నా, కాలేషా, సుల్తాన్ బాషా, తలకాయల వెంకట్రావు, జి. వెంకట్రావు, ఎం. వెంకటేశ్వర్లు, జయరావు, రాంబాబు, మాజీ ఎంపీటీసీ కోటేశ్వరరావు, హోటల్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img