విశాలాంధ్ర – ఉలవపాడు : రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమంలో భాగంగా గుడ్లూరు మండలంపూరేటిపల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభ కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని
మాట్లాడుతూన్న నేపద్యంలోకందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి కోరిన విధంగా మండల పరిధిలోని మేజర్ పంచాయతీ అయిన కరేడు లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాశ్వత భవనాన్ని మంజూరు చేస్తున్నట్లు ఆయన సభాముఖంగా తెలిపారు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి కి పలు వరాలు కురిపించిన ముఖ్యమంత్రి కరేడు కు కూడా తన నోటి నుండి పలికి కరేడు ప్రజల కు అన్ని విధాలా అవసరం అయిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాశ్వత భవనం నిర్మాణం కొరకు ఆమోదం తెలపడంతో ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.