Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మా జగనన్న తోనే నేను నా తుదిశ్వాస విడిచేవరకు, జగనన్నతోనే నా ప్రయాణం


మన్నెమాల సుకుమార్ రెడ్డి
విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు : నేను స్వర్గీయ డా॥ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమానిని. ఆయన మరణానంతరంజగనన్నతోనే నేను నడుస్తున్నాను. నా తుదిశ్వాస విడిచేవరకు, జగనన్నతోనే నా ప్రయాణం కొనసాగిస్తాను… అని కావాలి నియోజకవర్గానికి చెందినమన్నెమాల సుకుమార్ రెడ్డి అన్నారు
నేను పార్టీ లో పదవుల కోసం కానీ, మరే ఇతర ప్రాపకాలకు కానీ ఆశించి పని చేయలేదు… చేయను కూడాపార్టీలో అర్హతను బట్టి పదవులు వస్తాయి.పోతాయిరాజకీయంగా నాకు జన్మనిచ్చిందిగుర్తింపు ఇచ్చింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను సగౌరవంగా తల ఎత్తుకుని చెప్పగలను. నేను జగనన్న సైనికుడునుఅనిచెప్పగలిగినధైర్యంనాకు వున్నది.అని సుకుమార్ రెడ్డి తెలిపారుఅలాంటి నేనువేరే ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నానని,పార్టీ మారే ఆలోచనలో ఉన్నానని నా ప్రమేయం లేకుండా కొన్ని ప్రసార మాధ్యమాలలో రావడం నాకు తీవ్ర మనస్థాపం కలిగించింది.నేను ఎలాంటి వాడిని, నా మనస్తత్వం ఎలాంటిది అనే విషయం కావలి నియోజకవర్గ ప్రజలతో పాటు.జిల్లా పార్టీ పెద్దలు అందరికి తెలుసునేను ఎవరితో ప్రయాణం చేసిన ఉన్నత విలువలతోనే కొనసాగాను.దాని కారణంగా ఎన్ని సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా, ప్రమాదాలు అంచు వరకు వెళ్లినామాట తప్పలేదు. నమ్మిన వారికోసం కార్యకర్తల కోసం, వాళ్ళ బాగు కోసం మాట తప్పకుండా ఉండడం మా కుటుంబ పెద్ద ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా జగనన్న మాకు నేర్పిన సిద్ధాంతం.ఏది ఏమైనా ప్రతి కుటుంబంలో ఉండే సమస్యల్లాగా మా వై ఎస్ ఆర్ కుటుంబంలో కూడా చిన్న సమస్య వచ్చింది ఇది మా అంతర్గత సమస్య, దీని చక్కపెట్టడానికి ఇంట్లో పెద్దల్లా మా పార్టీ పెద్దలు వున్నారు. ఏది ఏమైనా పార్టీ పెద్దల నిర్ణయాణికి కట్టుబడి, పార్టీ నిర్ణయం ఏదైనా శిరసావహిస్తాను కానీ, ఏ సమస్య వచ్చిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. కావున నియోజక వర్గ ప్రజలకు, మీడియా మిత్రలకు నేను తెలియచేస్తుంది ఏమనగా… నేను శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల గెలుపులో కీలకంగా పనిచేసాను నాకు శాసనసభ్యులు అంతే గుర్తింపు ఇచ్చారు. ఈ విషయం నియోజకవర్గం లో ఎవరిని అడిగిన చెప్తారుకానీనేను పార్టీ నీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ని అడ్డం పెట్టుకుని తప్పులు చేశానని ప్రచార మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసినప్పటికీ మౌనంగా ఉన్నాను అంటే తప్పుని అంగీకరించినట్లు కాదు. మీరు చేసిన దుష్ప్రచారానికి నేను నా కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురై ఈ రోజు మీకు వివరణ ఇస్తున్నాను. నాపై తప్పుడు ప్రచారం చేసేటప్పుడు కనీసం నిజనిజాలు విచారించకుండా, నన్ను కనీసం వివరణ అడగకుండా ఊహాగానాలు ప్రచారం చేస్తున్నారు. అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలియ చేస్తూ మీడియా అనేది వాస్తవాలను తెలియచేయాలి నేను తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాడిని కాదు. నేను శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పై పోటీ చేస్తాను అని జరిగిన ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. పార్టీ మారుతున్నాను అని, వారికి కోట్లు ఆఫర్లు చేస్తున్నాను అని ప్రచారం చేసి రాసిన వారికి నా సమాధానం ఏమనగా నేను ఎటువంటి పరిస్థితుల్లో 2024 లో మళ్ళీ మా ప్రియతమ నేత వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా జగనన్న నుముఖ్య మంత్రి గా గెలిపించుకునే కార్యక్రమంలో నేను ఒక సమీదనైనా వంతు కృషి నేను చేస్తానని, పార్టీకి విధేయుడిగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియ చేస్తున్నానుఅనిమన్నెమాలసుకుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img