కమిషనర్ జాహ్నవి
విశాలాంధ్ర , నెల్లూరు (కార్పొరేషన్) : ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రజలందరికీ పారదర్శకంగా అందించేందుకు రూపొందించిన సచివాలయాల వ్యవస్థలో మెరుగైన సేవలు అందించాలని నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి కార్యదర్శులకు సూచించారు. స్థానిక 11, 14 వ డివిజనులైన బాలాజీ నగర్, ఏ.సీ నగర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను శనివారం తనిఖీ చేసిన అనంతరం సచివాలయాలను కమిషనర్ సందర్శించారు. సచివాలయంలో వివిధ పథకాలకు సంభందించిన రికార్డులు, కార్యదర్శులు, వలంటీర్ల హాజరు రిజిస్టర్లను కమిషనర్ పరిశీలించారు. జగనన్న కాలనీలు, టిడ్కో గృహాల పంపిణీ చేయడంలో వార్డు ఎమినిటీ కార్యదర్శులు మరింతగా కృషి చేయాలని సూచించారు.