Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాపూరు రాజకీయదిట్ట చెన్ను బాలకృష్ణారెడ్డి మృతి

విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు: పాత నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాల లో వెంకటగిరి నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ నాయకులు చెన్ను బాలకృష్ణారెడ్డి సోమవారం ఉదయం బెంగళూరులో తుది శ్వాస విడిచారు చిన్ను బాలకృష్ణారెడ్డి మొదటి నుంచి ఆనం కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ముఖ్యంగా ఆనం రామనారాయణ రెడ్డికి నియోజకవర్గంలో త్రిభుజం గా ఉంటూ ఆనం కుటుంబంతో పాటు నిత్యం సంబంధాలు ఉంటూ వారు ఏ రాజకీయ పార్టీలో ఉంటే ఆ పార్టీ లో చేరిరాపూరు మండలంలో 40 ఏళ్లు రాజకీయంగా చక్రం తిప్పి రాపూర్ మండల ప్రజల నిత్యం మమేకమై వారి సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తున్న వ్యక్తి చెన్ను బాలకృష్ణారెడ్డి.రాపూరు మాజీ Aవీజ ఛైర్మన్, ప్రస్తుత రాపూరు మండల వీూూ చెన్ను బాలకృష్ణారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు . బాలకృష్ణ రెడ్డి మృతితో ఆనం రామనారాయణ రెడ్డి కి రాజకీయంగా పెద్ద షాకే అని చెప్పవచ్చు. బెంగళూరులో మృతి చెందిన బాలకృష్ణారెడ్డి పార్థివ దేహాన్ని రాపూర్ కు తీసుకొని వస్తున్నారని తెలియడంతో రాపూరు మండలంలోని అన్ని వర్గాల ప్రజలు తండలుగా ఆయనకు నివాళి అర్పించేందుకు రాపూర్కు చేరుకుంటున్నారు అలాగే వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి బాలాయపల్లి వెంకటగిరి తదితర ప్రాంతాల నుండి కూడా అత్యధిక సంఖ్యలో చిన్ను బాలకృష్ణారెడ్డి అభిమానులు రాపూరు చేరుకుంటున్నారు. బాలకృష్ణారెడ్డి మృతి విషయం తెలియగానే దిగ్భ్రాంతి చెందినటువంటి హుటాహుటిన రాపూర్ కు బయలుదేరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img