Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నిర్దిష్ట గడువులోపు పరిష్కరించండి

స్పందంలో కమిషనర్ డి.హరిత

విశాలాంధ్ర, నెల్లూరు (కార్పొరేషన్) :నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన వేదికలో అందుకున్న సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించాలని అధికారులను కమిషనర్ డి.హరిత ఆదేశించారు. కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వివిధ విభాగాలకు సంబంధించి 14 విజ్ఞాపన పత్రాలను పరిష్కారం కోసం అందుకున్నామని, వాటన్నిటికీ వీలైనంత త్వరలో పరిష్కారం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. నగర పాలక సంస్థ కు సంభందించిన సమస్యలను స్పందన వేదిక ద్వారా పరిష్కారం పొందాలని కమిషనర్ ప్రజలకు సూచించారు. స్పందన పరిష్కార వేదిక కార్యక్రమంలో నగరపాలక సంస్థకు చెందిన అన్ని విభాగాల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img