విశాలాంధ్ర – వెంకటగిరి : ప్రతి నెల మున్సిపల్ సాధారణ అత్యవసర సమావేశం శనివారం కౌన్సిల్ సభ్యులు అరుపులు మధ్య ముగిసింది మున్సిపల్ చైర్మన్ నక్క బానుప్రియ అధ్యక్షతన 4గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం గౌరవ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి పట్టణ అభివృద్ధికి కావలసిన సలహాలను సూచనలను గౌరవ కౌన్సిల్ సభ్యులు ఇవ్వాలని అలాగే పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేయిస్తానని తెలిపారు అనంతరం పట్టణ అభివృద్ధికి పెంచిన సంబంధించిన అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఈ సమయంలో కౌన్సిలర్లు తీవ్ర వాదోపవాదాలు జరిగాయి సుమారు ఏడు మంది కౌన్సిలర్లు వార్డులలో అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రక్క వార్డులలో పనులు జరుగుతున్న తమ గురించి పట్టించుకునే నాథుడే లేడని తెలిపారు కౌన్సిల్ సమావేశంలో చైర్మన్ పోడియం ముందు కూర్చుని కౌన్సిలర్లు నిరసన తెలియజేశారు.