భారతదేశంలో ప్రపంచీకరణ పెరిగిన తరువాత గిగ్ పని సంస్కృతి పెరిగింది. గిగ్ పని సంస్కృతిలో క్యాబ్ డ్రైవర్స్, జోమోటో, స్విగ్గి డెలివరీ బాయ్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పనిచేసే కార్పెంటర్స్, ప్లంబర్స్ లాంటి వారు ఈ కోవకు చెందుతారు. భారతదేశంలో ప్రస్తుతం 1.5 కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో డెలివరీ సేవలలో 99 లక్షలు ఉన్నట్లు అంచనా. 2022లో నీతిఆయోగ్ నివేదిక ప్రకారం, 2029 నాటికి దాదాపు 2.35 కోట్ల మంది కార్మికులు గిగ్ ఎకానమీలో పనిచేయనున్నారు. భారతదేశ కార్మిక చట్టాల ప్రకారం, గిగ్ కార్మికులు కార్మికులుగా గుర్తించడంలేదు. వారు ‘‘డెలివరీ భాగస్వాములు’’, ‘‘డెలివరీ ఎగ్జిక్యూటివ్లు’’ వంటి పేర్లతో పనిచేస్తున్నారు. ఈ విధానం పెట్టుబడిదారీ సంస్థ నిజమైన దోపిడీ లక్షణాన్ని దాచిపెడుతుంది. వేతనాలపై కోడ్, పారిశ్రామిక సంబంధాలపై కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్పై కోడ్లో సూచించిన విధంగా కార్మికులకువచ్చే అన్ని హక్కుల నుండి గిగ్ వర్కర్లను మినహాయిస్తున్నారు. వీటిలో గంటలు, కనీస వేతనాలు, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్య ప్రయోజనాలు, ఓవర్ టైం వేతనంపై పరిమితి ఉన్నాయి. ఈ యూనియన్లు అధికారికంగా గుర్తించనందున కంపెనీ యజమానులపై లేబర్ కోర్టులలో కేసులు వేయలేనందున కంపెనీ యజమానులు ఏ యూనియన్లతోనూ చర్చలు జరపడానికి నిరాకరిస్తున్నారు. గిగ్ వర్కర్లకు నిర్ణీత పనిగంటలు లేవు. వారి పని షెడ్యూల్ సెట్చేశారు. యజమాని కంపెనీల ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారా కచ్చితంగా పర్యవేక్షిస్తారు. వారి పనిగంటలు తరచుగా రోజుకు 12-14 గంటల వరకు పొడిగిస్తున్నారు. ఇది వారికి విశ్రాంతి తీసుకోవడానికి లేదు. కుటుంబ సభ్యులతో చాలా తక్కువ సమయం గడుపుతున్నారు. గిగ్ వర్కర్లు తమ సేవలను తక్కువ సమయంలో అందించాలనే ఒత్తిడిలో ఉన్నారు. ప్రత్యేకించి డెలివరీ వర్కర్లు, క్యాబ్, ఆటో డ్రైవర్లు నిర్ణీత వ్యవధిలో ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తత్ఫలితంగా, వారు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు, ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. జీవనోపాధికి అభద్రత, స్థిరమైన ఉద్యోగం లేకపోవడం, తగిన, సురక్షితమైన ఆదాయం గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.
గిగ్ ఎకానమీలో చాలామంది డెలివరీ కార్మికుల సగటు ఆదాయాలు సాధారణంగా ప్రభుత్వం ప్రకటించిన కనీసవేతనాల కంటే తక్కువగా ఉన్నాయి. యాజమాన్య సంస్థలు ప్రారంభంలో అందించిన చాలా ప్రోత్సాహకాలను ఉపసంహరించుకుంటున్నారు. కంపెనీ లాభదాయకం కాదని భావించినప్పుడల్లా, క్షణంలో నోటీసు ఇచ్చి వారిని ఉద్యోగాల నుండి తొలగించవచ్చు. కంపెనీ యజమానులు కార్మికులను రోజుకు 12-14 గంటల పాటు కనీస వేతనాలతో పనిచేయమని ఒత్తిడిచేయడం ద్వారా కొనసాగించవచ్చు. వారి పనిసమయంలో జరిగే ప్రమాదాలకు వైద్య ఖర్చులను తిరస్కరించవచ్చు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వారిని ఉద్యోగాల నుండి తొలగించవచ్చు. కార్మికులుగా గుర్తింపు లేకుండా, ట్రేడ్ యూనియన్ హక్కులు లేనప్పుడు, గిగ్ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమిష్టిగా పోరాడే స్థితిలో సమస్యలకు పరిష్కారం లేదు. గిగ్ ఎకానమీలో చేరిన కార్మికుల సంఖ్య పెరగడంతో, ఇతర రకాల ఉపాధి లేనప్పుడు, కార్మిక సంఘాలు, కార్మికవర్గ సంస్థలు గిగ్ కార్మికులను కార్మికులుగా చట్టబద్ధంగా గుర్తించడం, స్థిర పని వంటి వారి హక్కులను కాపాడేందుకు ఆందోళన చేయాలి. గంటలు, సురక్షితమైన పని పరిస్థితులు, కనీస వేతనాలు, ఉద్యోగాల భద్రత, సామాజిక భద్రత, యూనియన్ల ఏర్పాటు హక్కు, ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగాలు మొదలైనవి అవసరం. గిగ్ వర్కర్లు మిగిలిన కార్మికవర్గంతో చేతులు కలపాలి. గిగ్ కార్మికులకు ఆరోగ్య సంరక్షణ, తగిన ఆదాయం, సామాజిక భద్రతా ప్రయోజనాలు వంటి హక్కులను పొందడం కొరకు కార్మిక సంఘాలు సమిష్టిగా కృషి చేయాలి. ఆళవందార్ వేణు మాధవ్
8686051752