Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

వ్యవసాయానికి కృత్రిమ మేథ ప్రయోజనమా?

భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం వెన్నెముక వంటిది. వ్యవసాయరంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు తోక్కుతోంది. వ్యవసాయ రంగంలో మొదట నాగలిపోయి ట్రాక్టర్‌ వచ్చినప్పుడు యంత్రాలు సాగుచేస్తాయా? అన్నవాళ్లున్నారు. ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లు తోడవడంతో రైతులు ఈ పద్దతులకు అలవాటు పడుతున్నారు. ఆధునిక యంత్ర పరికరాలరాకతో వ్యవసాయం రంగం నేడు కొంత పుంజుకున్నది. కానీ తర్వాతితరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు. ఇలాంటి సమయంలో కృత్రిమ మేథó సాంకేతికతలు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) తెరపైకి వచ్చింది. వ్యవసాయరంగంపైనా దీని ప్రభావంనేడు చూపుతున్నది. ఇప్పటికే కొన్ని కృత్రిమ మేథó సాంకేతికత (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయరంగానికి అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్నచర్చ సాగుతోంది. మన దేశస్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసాయం వాటా దాదాపు 50శాతం పైనే ఉన్నది.
కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్ల పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అనేక రకరకాల పథకాలు పెటిన్టా వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది. గత ఏడాది విడుదలైన ‘చాట్‌ జీపీటీ’ ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్‌ఓపెన్‌ ఏఐ సర్వీస్‌ ద్వారా చాట్‌జీపీటీ ఆధారంగా తయారైన ‘జుగల్‌ బందీ‘ చాట్‌ బొట్‌ వీటిలోఒకటి. రైతులకు కేంద్ర, రాష్ర ్టప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్‌వేర్‌. వాట్సాప్‌ ద్వాం ాకూడా అందుకోగల ఈ చాట్‌బోట్‌ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ రైతులకు అందిస్తూండటం విశేషం. చాట్‌జీపీటీ వంటి కృత్రిమమేథó సాఫ్ట్‌వేర్‌లకు వ్యవసాయంతో ఏంపని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్నిరకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు,ఎరువులు,కీటక నాశనులవంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడం కోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు.
అంచనా విశ్లేషణ : వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టికూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వేసిన పంట ఎంతబాగా పండుతుంది అన్ని కచ్చితంగా చెప్పగలదు. దీన్నే అంచనా విశ్లేషణ (ప్రిడిక్టివ్‌ అనాలసిస్‌) అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటేదాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. గరిష్టంగా దిగుబడులు: పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. జనరేటివ్‌ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్‌ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే అతితక్కువ కలుపు నాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండకావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టికూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారాచేసే ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి.
కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువుకాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్తవంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలాకాలం పడుతుంది. కానీ జనరేటివ్‌ ఏఐను ఉపయోగిస్తే అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపుణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కృత్రిమమేథó సాంకేతికతలు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)వేగంగా గుర్తించగలవు. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధంచేసిన ‘కిసాన్‌ ఏఐ (కిసాన్జీపీటీ)’ ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతుసంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది. దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేలమంది రైతులు కిసాన్‌ ఏఐ ద్వారా లబ్ధిపొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్‌ దేశాయ్‌ తెలిపారు. డిజిటల్‌ గ్రీన్‌ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్‌ ఏఐ’ ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది.
ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను చాట్‌ బొట్‌ ద్వారా అందిస్తోంది. ఇప్పటికే ‘మిర్చి, పసుపు’ పరికరాలు మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమశాతం వంటివాటి నినిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడిరగ్‌ ఇస్తున్నారు. నిప్పు … విద్యుత్తు… ఎలాగైతే మానవజాతి అభివృద్ధిని కీలక మలుపులు తిప్పాయో అలాగే కృత్రిమ మేథó కూడా అన్నిఅంటారు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌. మనిషీ, యంత్రమూ చేయీ చేయీ కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు వచ్చేశాయంటారాయన. కృత్రిమమేథó సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు… మనిషి చేసే ఎన్నోపనుల్ని అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పైస్థాయిలో…సృజనాత్మకత, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరమైన పనులు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. అంటే, ఇకముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకి కుడిభుజంగా మారనుందన్న మాట!
ఎన్‌.సీతారామయ్య, 9440972048

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img