Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

థేరోపతి తిరుపతి అయ్యింది

డాక్టర్‌ దేవరాజు మహారాజు

ప్రఖ్యాత చైనా యాత్రికుడు హ్యుయన్‌త్సాంగ్‌ తన ‘భారత దేశ యాత్ర’లో శబరిమలలో బౌద్ధాలయం ఉందని రాశాడు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త టి.ఏ.గోపీనాథరావు(18721919) 1908వ సంవత్సరంలో ట్రావెన్‌కోర్‌ పురావస్తు శాఖలో పనిచేశారు. భారత పురావస్తు శాఖ అధికారిక ప్రచురణ ‘ఇపిగ్రాఫికా ఇండికా’ అయ్యప్ప దేవళం బౌద్ధ క్షేత్రమని ప్రకటించింది. అంతేగాక, పి.సి. అలెగ్జాండర్‌ రాసిన ‘బుద్ధిజం ఇన్‌ కేరళ’లో అయ్యప్ప ఆలయంబౌద్ధాలయమనే వివరణ ఉంది. డాక్టర్‌ జమునా దాస్‌ ఒక జనరల్‌ సర్జన్‌. కానీ, ఆయన తన అభిరుచి కొద్దీ పరిశోధన సాగించి, ‘తిరుపతి బాలాజీ దేవాలయంఒకప్పటి బౌద్ధక్షేత్రం’ అనే పుస్తకం రాశాడు. అది ఇంగ్లీషులో ఉంది. నెట్‌లో దొరుకుతుంది. అసలు తిరుపతి అనే పేరు ఎలా స్థిరపడిరదో తెలుసుకుంటే, చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. థేరోపతి నుండి తేరోపతి, తేరోపతి నుండి తిరుపతి వచ్చింది. థేరోపతి అంటే థేరోవాదం. అశోక చక్రవర్తికాలంలో హీనయాన బౌద్ధాన్ని ‘థేరోవాదం’ అని పిలిచేవారు. థేరోవాదం అంటే నిజమైన వాదం అని అర్థం! బౌద్ధం స్వీకరించినవారు తమ పేరుచివర బోధి అని చేర్చుకుంటారు. వీరు గృహస్థులుగా ఉండొచ్చు. బౌద్ధ సన్యాసులైతే ‘భంతే’ అని అంటారు. ఇది పాళీ భాషా పదం. థేరోవాదాన్ని విశ్వసిస్తూ ప్రచారం చేస్తూ, ఒక దశాబ్దకాలం తమ ఉపసంపదలో (బౌద్ధ స్వీకరణలో) గడిపిన వారిని ‘థేరో’గా పిలిచారు. ఇంకా ఎక్కువకాలం గడిపిన పెద్దవారైతే ‘మహాథేరో’ అని అంటారు. ఈ పదాలు (గుర్తింపులు) ఇప్పటికీ బౌద్ధులలో వాడుకలో ఉన్నాయి. ఈ వివరాలన్నీ ఎందుకంటే బౌద్ధుల ‘థేరోపతి’ అనే పదం కాలక్రమంలో తిరుపతి ఎలా అయ్యిందో గ్రహించడానికి! ఆచార్య నాగార్జునుడి పేరుతో ఇప్పటి నాగార్జున సాగర్‌ పేరు ఎలా స్థిరపడిరదోఇప్పటి తిరుపతిలో ఒకప్పుడు ఉన్న బౌద్ధ బిక్షువు ‘థేరోపతి’ పేరుతో ఆ స్థలానికి తిరుపతి అనే పేరు స్థిరపడిరది. ఆ కాలంలో ఆయన చాలా ప్రసిద్ధుడు. ఆసియా దేశాల నుండి ఎంతో మంది బౌద్ధ భిక్షువులు ఆయనకాలంలో తిరుపతికి క్రమం తప్పక వస్తుండేవారు. అదిఅప్పుడు ఒక ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం గనకనే వస్తుండేవారు. తర్వాత కాలంలో పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఆది శంకరుడి కాలంలో ఆయన ప్రోద్బలంతో బౌద్ధాలయం ఈశ్వరాలయంగా మార్చారు. అది అలా కొంతకాలం కొనసాగిన తర్వాత, రామానుజుడు రంగం మీదికొచ్చాడు. ఆయన చొరవతో అనుచరులు ఈశ్వరాలయాన్ని విష్ణుమూర్తి ఆలయంగా మార్చారు. జనం దాన్ని వెనకటిఈశ్వరుడిగా పిలుచుకున్నారు. అలా అలా అది వెనకటి ఈశ్వరుడువెంకటేశ్వరుడిగా అయ్యింది. అందుకే చూడండి వేంకటేశ్వరుడనే పదం మనకు ఏ హిందూ పురాణాల్లోనూ, వేదాల్లోనూ కనిపించదు. ఒక వందేళ్ల క్రితంకూడా ఆ స్థలానికి ఇప్పుడు ఉన్న ప్రశస్థి లేదు.
ఈ విషయం మీద పుస్తకాలున్నాయి. ఇంటర్‌నెట్‌లో సమచారముంది. యూ ట్యూబ్‌లో వీడియోలున్నాయి. అభిరుచి ఉన్నవారు వెతుక్కోవచ్చు. హిందువులు గుండు చేయించుకున్నప్పుడు వెనక చిన్న పిలక ఉంచుకుంటారు. అది వారి సంప్రదాయం. కానీ, తిరుపతిలో దేవుడుకి తలనీలాలు సమర్పించినప్పుడు మాత్రం పిలక ఉండదు. అది బౌద్ధుల సంప్రదాయం. అంటే ఇప్పటికీ అక్కడ బౌద్ధ సంప్రదాయపు ఆనవాళ్లు ఇంకా ఉన్నట్టే కదా? తిరుపతిలో బాలా అనే ఒక జైన సన్యాసిని ఉండేదనీ, ఆమె బాలాశ్రీగా ప్రసిద్ధురాలనీ అదే పేరు ఇప్పుడు బాలాజీగా మారిందని కొందరు పరిశోధకులు చెప్పారు. ఇప్పటికీ ఉత్తర భారతీయులంతా వేంకటేశ్వరుణ్ణి బాలాజీ అని వ్యవహరించడం మనం చూస్తున్నాం. ఏమైనా తిరుపతి దేవాలయం వైష్ణవాలయంగా నిర్మాణం కాలేదు. ఒక బౌద్ధ క్షేత్రమే తొలుత ఈశ్వరాలయంగా మారి, ఆ తర్వాత విష్ణు ఆలయంగా, అంటే వేంకటేశ్వరుని గుడిగా మార్పులు చెందుతూ వచ్చింది.
అయ్యప్ప దేవాలయానిదీ అదే కథ. ఒక బౌద్ధాలయాన్ని స్వాధీన పర్చుకోవడంలో శైవులకూ, వైష్ణవులకు హోరాహోరీగా పోట్లాట జరిగింది. విషయం కోర్టుకు కూడా ఎక్కింది. తర్వాత, ఆవేశాలు చల్లబడి వారిలోవారికి సఖ్యత కుదిరి అయ్యకు, అప్పకూ అంటే ఇద్దరు తండ్రులకు పుట్టినవాడని కథలు అల్లుకుని, దాన్ని అయ్యప్పక్షేత్రంగా తీర్చిదిద్దుకున్నారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మ శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి: బుద్ధుని త్రి శరనాల నుండి ‘శరణం’ పదం తీసుకుని,..అయ్యప్ప శరణం అని పాడుకుంటున్నారు. పురాతన హైందవ సాహిత్యంలో ఎక్కడా అయ్యప్ప పేరూ, ఊరూ లేకపోవడం గమనించాల్సిన విషయం. సస్తాఅనేది బుద్ధుని పర్యాయ పదమని అమరకోశం చెపుతూ ఉంది. (సస్తా దేవో మనుష్యాణామ్‌). ఆ సస్తా పదాన్ని అయ్యప్పకు తగిలించి వాడుకుంటున్నారు. అయ్యప్ప దేవళంలో జరిగే చకియార, కుట్టువంటి సంప్రదాయ ఆరాధనలు బౌద్ధం నుండి తీసుకున్నవే. సాధారణ శకానికి పూర్వం మూడవ శతాబ్దంలో అంటే అశోక చక్రవర్తి కాలంలో బౌద్ధం కేరళలో బాగా వ్యాపించిందని కరుమతి, మావెలిక్కర, భరానిక్కవు,పల్కికవ్‌,కరునాగప్పలి, ఇడపల్లి, ధర్మ పట్టబ్నమ్‌, మటాయి పలిక్కునివంటి ప్రాంతాల్లో బౌద్ధంఉచ్ఛస్థితిలో ఉండేదనడానికి ఆధారా లున్నాయి. అలాగే త్రిచూర్‌ వడక్కనాథన్‌ ఆలయం, కొండు గల్లూర్‌ కురుంగ భగవతి ఆలయం, శబరిమలై అయ్యప్ప ఆలయం మొదలైనవన్నీ బౌద్ధాలయా లని కెఆర్‌ వైద్యనాథ్‌ వెల్లడిరచారు. ఇకపోతే మకరజ్యోతి మహాత్యం కూడా ఏమీ లేదని, అది మనుషులు చేస్తున్న జిమ్మిక్కే అని తేలిపోయింది. ఆ విషయం అయ్యప్ప దేవస్థానం బోర్డు వారే కోర్టులో ఒప్పుకున్నారు. పోలీసులు, ఫారెస్ట్‌అధికారులు కలిసి ప్రతిఏటా మకరజ్యోతి ప్రదర్శనను రక్తి కట్టిస్తున్నారు. అంటే అధికారికంగానే జనాన్ని మోసం చేస్తున్నారు. అందులో దైవ మహిమ ఏదీలేదన్నది రుజువైంది. అసలు దైవమేలేనప్పుడు ఇక మహిమ ఏముంటుంది? శివుడు తపస్సు చేస్తున్నట్లు ఉన్నవిగ్రహమైనా, విష్ణువు పవళించి ఉన్న విగ్రహమైనా, వేంకటేశ్వరుడు నిలబడిఉన్న విగ్రహమైనా అన్నీ మార్పులు చేసుకున్న బుద్ధ విగ్రహాలేనన్నది రుజువైన సత్యం! పూర్తిగా ఆభరణాలతో, పెద్ద నామాలతో కప్పేసిన వేంకటేశ్వరుణ్ణి ఎందుకు నిదానంగా చూడనివ్వరూ! మెడపట్టి ఎందుకు తోస్తుంటారు? అంటే బుద్ధుడి విగ్రహం మార్చుకున్న విషయం సామాన్య ప్రజలు ఎక్కడ గుర్తుపడతారోనని, వెనక అతికించిన రెండుఎక్స్‌ట్రా చేతుల బండారం ఎక్కడ బైటపడుతుందోనని భయమూ, కంగారూ అయిఉంటుంది. నమ్మకం చెడిపోతే ఆదాయం పోతుంది. ఆదాయం పోతేవ్యాపారాలు కుప్పగూలుతాయి కదా? శబరిమల అయ్యప్ప, తిరుపతి వేంకటేశ్వరుడి దేవాలయాలు మాత్రమే కాక, శ్రీ శైలం, మధుర మీనాక్షి, పూరీ జగన్నాథ్‌, సోమ్‌నాథ్‌, బద్రినాథ్‌, పండరీపూర్‌ ,విఠోబా వంటి దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలన్నీ ఒకప్పటి బౌద్ధ క్షేత్రాలేనని చెప్పడానికి ఏ మాత్రం సందేహించనక్కరలేదు. ఎప్పుడో కలియుగంలో రాబోయే కల్కి అవతారం గురించి తమ పవిత్ర గ్రంధాల్లో రాసుకున్నప్పుడు, కలియుగ దైవంగా చెప్పుకునే వేంకటేశ్వరుడి గురించి ఆ గ్రంథాల్లో ఎందుకు లేదూ?అలాగే అయ్యఅప్ప గురించి కూడా పురాణ రచయితలు రాయడం ఎందుకు మరిచారు? ఆ పురాణాలన్నీ రాశాక ఇలాంటి కొత్త దేవుళ్లకు రూపకల్పన జరిగిందని తెలుస్తూనే ఉంది..
ఇక్కడ ఆది శంకరాచార్య గురించి కూడా నాలుగు మాటలు చెప్పు కోవాలి. శంకరాచార్య గురువు గోవింద భగవత్పాద. అతను అప్పటి సమాజాన్ని మోసం చేయడానికి బౌద్ధ భిక్కుగా వ్యవహరించేవాడు. లోపల మతవ్యాప్తి కోసం తపించేవాడు. అలాంటి వాడి దగ్గర శిష్యరికం చేసిన ఆది శంకరుడు కన్యాకుమారి నుండి కశ్మీరుదాకా ప్రయాణిస్తూ, బౌద్ధాన్ని నాశనం చేయడానికి తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించాడు. ఆ కాలంలో చిన్న చిన్న రాజ్యాలుండేవి. ఆ రాజ్యాల రాజుల్ని ప్రభావితం చేసి, బౌద్ధారామాల్ని కూల్చడం, విగ్రహాలు మార్చడం జీవిత ధ్యేయంగా ఆదిశంకరుడు పనిచేశాడు. తన వితండ వాదనలతో సున్నిత మనస్కులైన బౌద్ధ బిక్షువుల్ని అవమానపరిచే వాడు. న్యూనతా భావంతో వారు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేవాడు. అందుకే శంకరాచార్యను హిందూ తీవ్రవాది అని కొందరు ముద్రవేశారు. అయితే ఇలాంటి విషయాల్ని వైదిక ధర్మ ప్రభోదకులు దాచిపెట్టి, అబద్ధపు అంధ విశ్వాసాల్ని ప్రచారం చేశారు. దేవుడెక్కడ? పునర్జన్మకు రుజువేది అని అడిగే ధైర్యం ఆనాటి సామాన్య ప్రజలకు ఉండేది కాదు. ఇప్పటికీ చాలా మందికి లేదు. మనువాదుల కుట్రలకు బలై ఏదో బతుకున్నామంటే బతుకుతున్నామన్నట్టు ఉంటున్నారు. విద్యాధికులు, ప్రజా ఉద్యమాలతో ఒకప్పుడు మమేకమైన వారు కూడా మనువాదుల వలలో చిక్కి, వారుప్రచారంచేసిన దేవీ దేవతలకు భజనలుచేస్తూ తిరుగుతున్నారు. అమాయకుల్ని, విద్యావిహీనుల్ని చైతన్యపరచే కార్యక్రమాలు చేయకుండా తామే మూఢత్వంలో మునిగి మురిగిపోతున్నారు. సామాన్యజనం ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి!
`కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img