Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

దేశాన్ని కుదిపిన అదానీ వ్యవహారం

ప్రపంచకుబేరుల్లో ఆకస్మికంగా రెండోస్థానానికి రెండేళ్లలో ఎగబాకి, అంతకన్నా అనూహ్యంగా కేవలం రెండు వారాల వ్యవధిలో రెండంకెలస్థానానికి దిగజారిన భారతీయ పారిశ్రామిక వేత్త అదానీవ్యవహారం నేడు దేశాన్ని కుదుపుతోంది. పార్లమెంటు ఉభయసభలు ఆ వ్యవహారంపై చర్చ కోసం పట్టుబడుతున్న ప్రతిపక్షాలు,అవసరం లేదంటున్న అధికార పక్షాల వైఖరివల్ల ఏ చర్చలూ జరగకుండానే వాయిదాలు పడు తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ విపరీతమైన కుదుపులకు లోనవు తుంది. అదానీ సంస్థల్లో షేర్లధరలు పతనంతో కోట్లాదిరూపాయలు ఆవిరౌ తున్నాయి. ఆ షేర్లలో మదుపుపెట్టిన కోట్లాది మంది నష్టపోతున్నారు. దేశసంపద ఆవిరి అవ్వడమే కాకుండా విదేశీ,స్వదేశీ మదుపరుల్లో మన మార్కెట్‌పై నమ్మకం సడలే అవకాశం ఉంది. అది ఆర్ధికవ్యవస్థకు మరింతచేటు. అదానీ వ్యవహారంలో మనలాంటి సామాన్యులకు తెలిసిన దానికన్నా తెలియనిదే ఎక్కువ.అర్ధమైందానికన్నా అర్ధం కానిదే ఎక్కువ. నా వరకూ అర్ధమైనదేమిటంటే అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ హిండెన్‌ బర్గ్‌ అదానీ పరిశ్రమల విలువ ఎదుగుదలలో కుంభకోణం ఉంది అంటూ కొన్నిఆధారాల్ని బయటపెట్టింది. ఈ దేశపు చట్టాలకు వ్యతి రేకంగా విదేశాల్లో కొన్ని షెల్‌కంపెనీలను ఏర్పరిచి,వాటి ద్వారా లావా దేవీలు జరిపి,షేర్‌ధరల్ని ఇబ్బడిముబ్బడిగా (ఓవర్‌ వేల్యూ)పెంచి, మళ్ళీ వాటిని బ్యాంకుల్లో కుదువబెట్టి మరింతగా రుణాల్ని పొందినట్టు ఆరోపణ. తద్వారాగోరంతహామీ చూపించి కొండంత రుణాలు పొందినట్టు అభియోగం. ఈ తరహా కార్యకలాపాల్ని నియంత్రించాల్సిన సెబీ గానీ, పర్యవేక్షించిన సంస్థలు గానీ జవాబు చెప్పాల్సిన తీవ్ర అభియోగాలు. అదానీ సంస్థలు కూడా తీర్చాల్సిన సందేహాలు. ఆయా జవాబుదారీ వ్యవస్థలు సమాధానాలతో ముందుకు రానంతవరకూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజాధనంలక్షల కోట్లమేరకు ఆవిరి అయిపోతుంది. బ్యాంకులు మునిగి పోవడమే కాకుండా మదుపరుల విశ్వాసం కోల్పోయి మార్కెట్‌ కూడా నష్టపోతుంది. ఆరోపణ చేసిన సంస్థ నిఖార్సయిన సంస్థ కాకపోవచ్చు. దాని స్వంత ఎజెండా దానికి ఉండొచ్చు.అయితే ఆ నివేదిక తెచ్చిన కుదుపుని దృష్టిలో పెట్టుకొని అయినా ప్రభుత్వం స్పందించాలి. నిజా నిజాలు తేల్చేలా చర్యలు తీసుకోవాలి.
డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img