Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదరికంలో అగ్రదేశం భారత్‌!

బొల్లిముంత సాంబశివరావు

ప్రపంచ వ్యాపితంగా 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యం చేరుకోవటం సాధ్యం కాదని ప్రపంచ బ్యాంక్‌ స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాలో ఇప్పటికీ 72 కోట్ల మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని పేర్కొంది. ఆఫ్రికా ఖండంలోని దేశాలలో ఎక్కువ పేదరికం ఉందని తెలిపింది. ప్రపంచ బ్యాంక్‌ వెల్లడిరచిన పేదరికం లెక్కలు కూడా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాపితంగా పేదరికం తీరుతెన్నులపై బహుముఖ పేదరిక సూచీ మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌(ఎంపీఐ)ని యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ పోగ్రామ్‌(యూఎన్‌పీడీ) ఆక్స్‌ఫర్డ్‌ పావర్టీ అండ్‌ హ్యుమన్‌ డెవలప్‌మెంట్‌ ఇనీషియేటివ్‌ ఇటీవల వెల్లడిరచింది. ప్రపంచవ్యాప్తంగా పేదలు ఎదుర్కొనే అనేకరకాల అంశాలను, అంటే చదువులేకపోవటం, పోషకాహారంలోపం, సరైన వైద్యసహాయం అందకపోవటం, రక్షిత మంచినీరు పథకాలు లేకపోవటం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ సూచీ రూపొందించామని ఓపీహెచ్‌ నివేదిక పేర్కొంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 105దేశాల్లో 130కోట్ల మంది పేదలు ఉన్నారని ఈ నివేదిక పేర్కొంది.
పేదరికం గురించి అనేకమంది ప్రముఖులు వ్యక్తంచేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. పేదరికం అనుభవించే వారి బాధను గుడ్డివారు కూడా చూడగలరు-ఆర్థికవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌. పేదరికమనే సముద్రపుదీవుల్లో మనం ఎంతమాత్రం సంతోషంగా జీవించలేం- ఆర్ధికవేత్త స్వామినాథన్‌. పేదరికం అత్యంత తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘన-కె జి బాలక్రిష్టన్‌-సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. భారత దేశంలో పేదరికం లెక్కలు తీవ్ర గందరగోళంగా ఉన్నాయి. భారత పాలకులు పేదరికాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువచేసి చూపుతున్నారు. భారతదేశంలో సుమారు 60కోట్ల మంది రోజుకి 3.65 డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఇదికూడా క్షేత్రస్థాయిలో పరిశీలనచేసి చెప్పిందికాదు. చాలా మంది పేదలకు వంద రూపాయలకు మించి సంపాదన లేదు. తినీతినక బతుకుతున్నారు. 2005-06, 2015-16 మధ్య 63.5 కోట్ల నుంచి 36.4కోట్లకు పేదరికం తగ్గిందనే లెక్కలు చెబుతున్నారు. నీతి అయోగ్‌ 2021 నివేదిక ప్రకారం, భారతదేశంలో మొత్తం పేదరికం 25శాతం ఉంది. అంటే దేశ జనాభారీత్యా సుమారు 35 కోట్లమంది పేదరికంలో ఉన్నారు.
పేదరికం అనేది ఆర్ధిక అసమానతల ఫలితంగా ఏర్పడిరది. కనీస అవసరాలైన తిండి, గూడు, బట్టలు, వైద్యం, విద్యను పేదరికం దూరం చేస్తుంది. ఒక వ్యక్తి రోజుకి 2300 కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకుంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లుగా చెబుతున్నారు. భారతదేశం లోని గ్రామీణ ప్రాంతంలో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 2100కేలరీల ఆహారం అవసరమని ప్రణాళికా సంఘం తెలిపింది. ఇది ప్రపంచ బ్యాంకు చెప్పిన ప్రమాణాల కన్నా తక్కువ. స్వాతంత్య్రానికి పూర్వం దాదాబాయ్‌ నౌరోజీ జైల్లోని కనీస పౌష్టికాహారం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశాడు. పావర్టీ అండ్‌ ఇన్‌ బ్రిటిష్‌రూల్‌ ఇన్‌ఇండియా అనే పుస్తకంలో మన దేశంనుంచి బ్రిటన్‌కు సంపద తరిలిపోవటమే భారతదేశంలో పేదరికానికి కారణమని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం పిడి ఓరaా, దండేకర్‌, నీలకంఠన్‌ నాద్‌, మిన్హాస్‌, పీకే బర్ధన్‌, మాంటెక్‌ సింగ్‌, ఆహ్లువాలియా గౌరవదత్‌, రావెల్లీస్‌, లక్షావాలా తదితరులు పేదరికంపై అంచనా వేశారు. 1960కి పూర్వం పేదరికానికి సంబంధించిన అంచనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. మన్హాస్‌ 37శాతం, అహ్లువాలియా 56శాతం, పీకే బర్దన్‌ 54శాతంగా పేదరికాన్ని పేర్కొన్నారు. 1950లో జాతీయ నమూనా సర్వే సంస్థ (చీూూూ) భారత దేశంలో ఏర్పాటైంది. ఈ సంస్థ 1950 నుంచి 1973 వరకు ప్రతి సంవత్సరం పేదరిక గణాంకాలను అంచనా వేసింది. నెలసరి తలసరి వినియోగవ్యయాన్ని గ్రామీణప్రాంతంలో రూ.49, పట్టణ ప్రాంతంలో 56 రూపాయలగా నిర్ణయించారు. 1972-73 నుంచి ప్రతి ఐదు సంవత్సరాల కొకసారి పేదరిక గణాంకాలను సేకరించింది. 2019లో జాతీయ నమూనా సర్వే సంస్థను, కేంద్ర గణాంకాల సంస్థ (జూ)ను విలీనంచేసి జాతీయ గణాంకాల సంస్థను ఏర్పాటు చేశారు.
నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో (1969-74) ఇందిరాగాంధీ 1971లో గరీబీ హఠావో నినాదం ఇచ్చింది. ఐదవ ప్రణాళికలో (1974-79) పేదరిక నిర్మూలనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇందిరాగాంధి 20సూత్రాల పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా పేదరిక నిర్మూలన చేస్తానని ప్రకటించింది. పాలకుల పేదరిక నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలు, పధకాలు ఆచరణలో విఫలమయ్యాయి. 1979లో పై కె ఆలఫ్‌ు కమిటీ, 1993లో డాక్టర్‌ లక్షావాలా కమిటీ, 2005లో సురేష్‌ డి.తెందూల్కర్‌ కమిటీ అందులో భాగమే. 1993లో లక్షావాలా అధ్యక్షతనఉన్న కమిటీ రాష్ట్రాలమధ్య ధరల వ్యత్యాసాన్ని, రాష్ట్రాల ప్రత్యేక వినియోగ ధరలసూచి ఆధారంగా పేదరికాన్ని సూచించింది. తెందూల్కర్‌ కమిటీ తన నివేదికను 2009 కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. నివేదికలో పేదరికం దిగువన ఉన్నవారి రోజువారి ఖర్చు పట్టణప్రాంతాల్లో 32, గ్రామీణ ప్రాంతంలో 26 రూపాయలుగా పేర్కొంది. ఆ పైన ఆదాయం ఉన్నవారు పేదరికానికి ఎగువన ఉన్నవారిగా పేర్కొంది. ఇది పేదరికాన్ని అపహాస్యం చేయటమే. నివేదిక ఇచ్చిన తెందూల్కర్‌ గాని, మంత్రులు గానీ, ఒకరోజు ఈ ఖర్చుతో జీవిస్తే తెలుస్తుంది పేదరికం అంటే ఏలా ఉంటున్నది. తెందూల్కర్‌ కమిటీ నివేదికపై సర్వత్రా విమర్శలు రావటంతో, ఆయన సూచించిన పేదరిక అధ్యయన పద్ధతిని సమీక్షించేందుకు 2012లో రంగరాజన్‌ అధ్యక్షతన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ప్రతి పదిమందిలో ముగ్గురు పేదరికంలో ఉన్నట్లు పేర్కొంది. సురేశ్‌ తెందూల్కర్‌ కమిటీ పేదరికాన్ని 21.9శాతంగా పేర్కొనగా, రంగరాజన్‌ కమిటీ 29.5శాతంగా పేర్కొంది. మోదీ నాయకత్వాన ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం కూడా తెందూల్కర్‌ నివేదికపైనే మొగ్గు ఫలితంగా ఎనిమిది సంవత్సరాల మోదీ ప్రభుత్వ పాలనలో 7కోట్ల, 60లక్షల మంది అదనంగా నిరుపేదల జాబితాలో చేరారు. ప్రపంచ దేశాల్లో తన పరువుపోయి, అవమానంపాలు కావాల్సి వస్తుందని పేదరికాన్ని తగ్గించి చూపేందుకు తనకు అనుకూలమైన వారితో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు కమిటీ నాటకాన్ని తెరపైకి తెచ్చాయి. ఈ కమిటీలేవీ క్షేత్రస్థాయిలోకివెళ్లి లోతుగా పరిశీలన జరిపి పేదరికాన్ని అంచనావేయకుండా ప్రభుత్వాలకు అనుకూలంగా పేదరికాన్ని తగ్గించి నివేదికలు ఇచ్చాయి. కనీస రోజూ వారీ జీవనవ్యయం వీరికి తెలిసికూడ తక్కువచేసి చెప్పారు.
యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టాయి. ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(IRణూ), జవహర్‌ గ్రామ అభివృద్ధియోజన, రూరల్‌ హౌసింగ్‌-ఇందిరా అవాస్‌ యోజన, పనికోసం అహార కార్యక్రమం, జాతీయ వృద్ధాప్య పెన్షన్‌, సంపూర్ణ రోజ్‌గార్‌ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌(దీనదయాళ్‌ అంత్యోదయ యోజన), మహాత్మా గాంధి గ్రామీణ ఉపాధి హామీపధకం, జాతీయ పట్టణ జీవనోపాధి పధకం, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రధాన మంత్రి అవాస్‌ యోజన(గ్రామీణ పట్టణ), ప్రధాన మంత్రి గ్రామసడక్‌ యోజన మొదలైన పథకాలు అందులోనివే. ఈ పధకాలేవీ పేదరికాన్ని రూపమాపలేక పోయాయి. పేదరికానికి మౌలిక కారణం ఆర్థిక వ్యత్యాసాలు. భారత సామాజికవ్యవస్థ వర్గ వైరుధ్యాలతో కూడి ఉంది. గ్రామీణ పేదల జీవనోపాధి అయిన భూమి, కార్మికుల శ్రమశక్తితో పనిచేసే పరిశ్రమలు కొద్దిమంది భూస్వాముల, బడా పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్నాయి. ఫలితంగా దేశ సంపదలో ఒక శాతం మంది వద్ద 25శాతం పైగా ఉంటే, 60శాతం ప్రజల వద్ద 19శాతం సంపద మాత్రమే ఉంది. 28శాతం ప్రజల రోజువారీ ఆదాయం 160 రూపాయలు మాత్రమే. దీన్ని గమనిస్తే ఆర్థిక వ్యత్యాసాలు ఏ స్థాయిలో ఉందీ వెల్లడౌతుంది. విప్లవ భూసంస్కరణలద్వారా గ్రామీణ పేదలకు భూ పంపిణీ,పారిశ్రామిక రంగంలో కార్మికులకు భాగస్వామ్యం, శ్రమకు తగ్గ వేతనం అమలుజరిగి ఉద్యోగ, ఉపాధిఅవకాశాలు కల్పించాలి. బడా భూస్వామ్య, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకోసం పనిచేస్తున్న దేశ పాలకులకు వీటిని అమలు జరపరు. వీటికోసం ప్రజలు ఉద్యమాలు చేయకుండా పక్కదారిపట్టించటానికి బూటకపు సంక్షేమపధకాలను ముందుకు తెస్తున్నారు. పాలకులకు వ్యతిరేకంగా తమ పేదరికానికి కారణమైన మౌలిక సమస్యల పరిష్కారానికి పేదలు ఉద్యమించాలి.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతు కూలీ సంఘం (అం.ప్ర.)
సెల్‌: 9885983526

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img