Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భారత్‌ విశ్వ గురువు ఎలా అయ్యింది?

 డాక్టర్‌  దేవరాజు  మహారాజు
దేశం విశ్వగురువుగా నిలబడాలంటే ఇదిగో ఇలాంటి కట్టుకథలు నమ్ముతూ బతుకుతుండాలి! ఉదాహరణకు కొన్ని చూద్దాం!!
రాముడు పాయసానికి పుట్టాడు. సీత భూమికి పుట్టింది. వినాయకుడు నలుగుపిండికి, పార్వతి మంచుకొండకు పుట్టారు. శ్రీ శుకుడు చిలుకకు, మాండవ్యుడు కప్పకు, శౌనకుడు కుక్కకు, అశ్వద్ధామ  గుర్రానికి, విశ్వామిత్రుడు గాడిదకు, వాల్మీకి పుట్టకు, రుష్యశృంగుడు జింకకూ పుట్టారు! విష్ణుమూర్తి బొడ్డు లోంచి బ్రహ్మపుడితే, బ్రహ్మ మనసులోంచి సరస్వతి పుట్టింది. ఇకపోతే, ఆదిశక్తి గుడ్లుపెట్టగా త్రిమూర్తులు పుట్టారు కదా? మహాలక్ష్మి పాల సముద్రానికి, కర్ణుడు సూర్యుడికి పుట్టారు. కట్టుకథల కల్పిత పురాణాల్లో జన్మవృత్తాంతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సరే, గొప్ప సృజనాత్మక రచనలంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అవన్నీ నిజం. వాటిని మనస్పూర్తిగా విశ్వసించాలి. విశ్వసించి పూజించాలి. పూజించి, మోక్షం సాధించాలి. జన్మరాహిత్యం సాధించాలి. అని మత పండితులు, మత బోధకులు చెపుతూ ఉంటేనే చోద్యంగా ఉంటుంది. వారి అజ్ఞానానికి జాలి కలుగుతుంది. 

భారతదేశంలోని కొందరు చక్రవర్తులు తమ మంత్రుల్ని, సేనాపతుల్ని ఎవరిని ఎంచు కున్నారో, ఎవరిని నియమించు కున్నారో గమనించండి. వ్యక్తిగత అభిప్రాయాలు ఏవి ఉన్నా, వాటిని ఒక్క క్షణం పక్కనపెట్టి, సమదృష్టితో అలోచించి చూడండి. అక్బర్‌ చక్రవర్తి ముస్లిం రాజు కదా? అతని దగ్గర పనిచేసినవారు హిందువులైన తోడర్‌మల్‌, బీర్బల్‌, మాన్‌సింగ్‌ ! చత్రపతి శివాజీ హిందూ రాజు కదా? అతని దళపతిగా పనిచేసిన వాడు దర్యా సారంగ్‌, సేనాపతులు ఇబ్రహింఖాన్‌, దౌలత్‌ఖాన్‌లు అయినప్పుడు వీరు మతవాదులవుతారా? లౌకిక వాదులవుతారా? ఏకొంచెం ఇంగిత జ్ఞానం ఉన్నవారికైనా విషయం బోధపడుతుంది.. ఆ తర్వాత ఔరంగజేబు సర్వసైన్యాధిపతి జయసింగ్‌. ఇక దక్షిణ భారతదేశంలో టిప్పుసుల్తాన్‌ దగ్గర ప్రధానిగా ఉన్నది పూర్ణయ్య. హైదరాబాదు తానీషా దగ్గర మంత్రులు అక్కన్న, మాదన్న, మరి వీరిని లౌకిక వాదులందామా? మతవాదులందామా?
సరే, ఈ విషయాలు అలా ఉండనిచ్చి`వీర శైవులు, వీర వైష్ణవుల మధ్య హోరాహోరి పోట్లాటలు ఎందుకు జరిగాయి? ఇద్దరూ వైదిక మతాచారాలు పాటించేవారే కదా? మరి వీరి మధ్య మారణ హోమాలు, ఎందుకు జరిగాయి? వీరిలో మతవాదులెవరు, లౌకిక వాదులెవ రన్నది ఇప్పుడు ఆలోచించి తేల్చుకోండి! మనువాదులు అఘాయిత్యాలకు, అత్యాచారాలకు పాల్పడి, వారి తప్పుల్ని కప్పి పుచ్చుకోవడానికి గత కాలపు ముస్లిం పాలకుల్ని, ఈ కాలపు ముస్లిం పౌరుల్ని దుయ్యబడుతుంటారు. అర్థరహిత మైన వాదనలు చేస్తూ, అభాసు పాలవుతుంటారు. ఒక క్రమ పద్ధతిలో విశ్ల్లేషించుకుంటూ వస్తే, గతంలోనూ, ప్రస్తుతంలోనూ మనువాదులు చేసిన, చేస్తున్న దుర్మార్గాలు స్పష్టంగా కళ్లముందుంటాయి. ఇలాంటి వాస్తవ స్థితిగతులు నెమరువేసుకుంటూ దేశం విశ్వ గురువు కాలేదు. వీలైనంతవరకు అభూత కల్పనలు ప్రచారం చేసుకుంటూ, ‘విశ్వగురువు’ అయ్యానని అనుకుంటోంది.
దేశం విశ్వగురువుగా నిలబడాలంటే ఇదిగో ఇలాంటి కట్టుకథలు నమ్ముతూ బతుకుతుండాలి! ఉదాహరణకు కొన్ని చూద్దాం!!
రాముడు పాయసానికి పుట్టాడు. సీత భూమికి పుట్టింది. వినాయకుడు నలుగుపిండికి, పార్వతి మంచుకొండకు పుట్టారు. శ్రీ శుకుడు చిలుకకు, మాండవ్యుడు కప్పకు, శౌనకుడు కుక్కకు, అశ్వద్ధామ  గుర్రానికి, విశ్వామిత్రుడు గాడిదకు, వాల్మీకి పుట్టకు, రుష్యశృంగుడు జింకకూ పుట్టారు! విష్ణుమూర్తి బొడ్డు లోంచి బ్రహ్మపుడితే, బ్రహ్మ మనసులోంచి సరస్వతి పుట్టింది. ఇకపోతే, ఆదిశక్తి గుడ్లుపెట్టగా త్రిమూర్తులు పుట్టారు కదా? మహాలక్ష్మి పాల సముద్రానికి, కర్ణుడు సూర్యుడికి పుట్టారు. కట్టుకథల కల్పిత పురాణాల్లో జన్మవృత్తాంతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సరే, గొప్ప సృజనాత్మక రచనలంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అవన్నీ నిజం. వాటిని మనస్పూర్తిగా విశ్వసించాలి. విశ్వసించి పూజించాలి. పూజించి, మోక్షం సాధించాలి. జన్మరాహిత్యం సాధించాలి. అని మత పండితులు, మత బోధకులు చెపుతూ ఉంటేనే చోద్యంగా ఉంటుంది. వారి అజ్ఞానానికి జాలి కలుగుతుంది. 
ఒకవైపు ఆధునిక మానవులుగా జీవిస్తూ, మరోవైపు విచక్షణా జ్ఞానంలేని మానవజాతి ‘తొలిదశలోని వారిగా’ ఆలోచిస్తూ ఉంటే, బాధ కలుగుతుంది! వీరెప్పుడు ఆధునికుడి ఆలోచనను అందుకోగలరు? అని, అనిపిస్తుంది. వారి మెదళ్లను చుట్టుకుని ఉన్న మూఢత్వాని బద్దలు కొట్టుకుని బైటపడితే గాని వారికి వాస్తవాలు అర్థంకావు. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశ ప్రజలు బైటపడరు. ఈ దేశ నాయకులు బైటపడనీయరు. బైటపడితే దేశం విశ్వ గురువు కాకుండా పోతుందేమోనని,...వారికి బెంగ, బుగులు. తాము ఎలా చచ్చినా ఫరవాలేదు. కానీ దేశం మాత్రం మూర్ఖత్వానికీ బ్రాండ్‌ ఎంబాసిడర్‌గా నిలబడాలన్నదే వారి కోరిక! ప్రపంచం నవ్విపోతున్నా పట్టించుకోకుండా ‘తామే విశ్వగురువులమని చెప్పుకు తిరుగుతుండాలి!
‘‘వేదాలు 1.96 కోట్లకు పూర్వం వెలువడ్డాయి. ఓం అనే శబ్దతరంగాలే ప్రపంచంలోని అన్ని శబ్ద తరంగాలకు మూలం. స్తబ్దుగా ఉన్న ప్రకృతి ఓం శబ్దంతోనే చైతన్య వంతమవుతుంది. మానవ మస్తిష్క చైతన్యానికి ఓం శబ్ద తరంగాలే ముఖ్యం!’’ అని చెప్పుకుంటూ ఆత్మద్రోహం చేసుకోవడం తప్పిస్తే ఏదీ రుజువు కాలేదు. ఇలాంటి మూర్ఖత్వం వ్యాప్తిచేస్తూ పాపం దేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలని తాపత్రయ పడుతుంటారు. గత కాలపు పురాణాలే కాదు, వాటి సారాంశాన్ని నేటి వ్యాపార సినిమాలు కూడా తమ శాయశక్తులా ప్రచారం చేస్తున్నాయి. అఖండ, దేవి, నాగదేవత, పాతాళభైరవి, దయ్యం, పిశాచం, ఆత్మ మొదలైన ఫాంటసీ ఫిక్షన్‌కు సంబంధించినవి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చూపించే సినిమాలన్నీ సమకాలీన సమాజాన్ని తప్పుదారి పట్టించేవే. దర్శక, నిర్మాతల, సినీ హీరోల నమ్మకాలకు మరింత మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్ని జోడిరచి ముఖ్యంగా సైన్సును వాడుతూ, సైంటిఫిక్‌ స్పిరిట్‌కు వ్యతిరేకంగా సినిమాలు తీయడం, జనావళిని అంధవిశ్వాసాల్లో ముంచడం క్షమించరాని నేరం! సమాజ ద్రోహం!! బహుశా దేశం విశ్వగురువు కావాలంటే ఇలాంటి అసందర్భమైన, అసంగతమైన అబద్దాల ప్రచారం కొనసాగాల్సిందేనేమో?
అనాదిగా స్తవము, సుప్రభాతం, సంకీర్తనం` దేవాలయ గోపురాల మీద, గోదల మీద అంతా శృంగారమే! ప్రపంచంలో ఇంతటి పచ్చి శృంగార భావనలు మరోచోట ఎందుకు లేవూ? ఈ సనాతన, వైదిక, బ్రహ్మణ సంస్కృతిలో మాత్రమే ఎందుకు ఉన్నాయీ? ఆలోచించాల్సిన విషయం. దేశం విశ్వగురువు కావాలంటే ఈ పచ్చి శృంగారం తప్పదా? కన్నతల్లిలాంటి అమ్మవారిని ‘జగడపు చనువులు జాజర’ చేయించిన అన్నమయ్యను ఏమనాలీ? కన్నతల్లిలో కూడా శృంగారం చూసిన అన్నమయ్య, తరతరాల భక్తులకు కూడా ఆ శృంగారాన్నే చూపించాడు కదా? ఆ మాట అన్న అన్నమయ్యను తప్పుబట్టరు. ఆయనో భక్తాగ్రేసరుడయి పొయ్యాడు. ఆ మాటలో ఉన్న అసలైన అర్థం ఇదీ అని చెప్పిన వాడిది మాత్రం తప్పవుతుంది? వారెవా సనాతనమా? అయ్యారే ఛాందసమా? దేశం విశ్వగురువు కావడమంటే మాటలా మరి? ఆధునికి నాస్తికోద్యమ నిర్మాత గోరా (15.11.1902` 26.07.1975) ఏమన్నారో ఒకసారి జాగ్రత్తగా  గమనించండి. అంతే కాదు, సీరియస్‌గా ఆలోచించండి. ‘‘దేవుడనేది మానవుడు కల్పించిన అబద్దం! చాలా అబద్దాల వలెనే గత కాలంలో అదికొంతవరకు ప్రయోజనకరంగా ఉంటే ఉండిరదేమో! కానీ, అన్ని అబద్దాల వలెనే ఇది కూడా రానురాను జీవితాన్ని కల్మషం చేసింది. కనుక, మానవ సంఘంలో అవినీతి అంతమై నీతి పెరగాలంటే దైవ విశ్వాసం పోవాలి! పోక తప్పదు!! అబద్దాలతో దేశం విశ్వగురువు ఎన్నటికీ కాలేదన్నది గ్రహించాల్సిన సారాంశం.
భారత్‌ ‘విశ్వ గురువు’ ఎలా అయిందంటే కొన్ని ఉదాహరణలు చూద్దాం! పేదరికంలో భారత్‌ నైజీరియాను అధిగమించింది. 2018లో నైజీరియాలో 8.7కోట్ల కటిక పేదలుంటే, భారత్‌లో 7.3కోట్ల కటిక పేదలు మాత్రమే ఉన్నారు. అలాగే, 2022లో నైజీరియాలో పేదలు 7కోట్లకు తగ్గిపోతే, భారత్‌లో కటిక పేదల సంఖ్య విపరీతంగా పెరిగి 8.3 కోట్లకు చేరింది. ఈ దేశప్రధాని రోజుకు 18గంటలు అవిశ్రాంతగా పనిచేసి, దేశంలో దారిద్య్రాన్ని ఘనంగా పెంచుతున్నారు. తమ హిందుత్వ భావజాలంతో దేశాన్ని విశ్వగురువు చేయాలని తాపత్రయ పడుతున్నారు. డాలర్‌తో మన రూపాయి మారకం 2014లో 59గా ఉంటే, 2022లో 80కి చేరింది. రూపాయి విలువ ఎంత పడిపోయిందో, దేశం అంత విశ్వగురువు అవుతుందన్న మాట! వంటగ్యాస్‌ 2014లో రూ.414 ఉంటే, 2022 నాటికి అది రూ.1053 కు పెరిగింది. సామాన్యుడి జీవితం ఎంత భద్రంగా ఉందో అంచనా వేసుకోవచ్చు. 2014లో ఈ దేశానికి అప్పు 58లక్షల  కోట్లు ఉంటే, 2022లో దాన్ని గణనీయంగా 139 లక్షల కోట్లకు పెంచిన ఘనత బీజేపీ సూపర్‌ మ్యాన్‌, కాపలాదారు, చాయ్‌వాలా అయిన మోదీదే!
 కేంద్ర సాహిత్య అకాడమీ విజేత, జీవశాస్త్రవేత్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img