డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి
ప్రపంచమంతటా మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. పితృస్వామ్య వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలందరికీ సీపీఐ సంఫీుభావం తెలియజేస్తోంది. స్త్రీ, పురుష సమానత్వాన్ని అమలు జరపాలని పార్టీ గట్టిగా కోరుతోంది. 1917లోనే సోవియట్ రష్యాలో మహిళలు బాధలనుండి విముక్తి పొందిన తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ రోజు రష్యా విప్లవానికి నాయకత్వం వహించిన వ్లదిమీర్ లెనిన్ నిర్ద్వద్వంగా ఇలా చెప్పారు. ‘‘పెట్టుబడీదారీ వ్యవస్థలో మానవజాతిలో సగం ఉన్న మహిళలు రెట్టింపు హింసకు గురవుతున్నారు.’’ రెట్టింపు హింసకు గురవుతున్న మహిళలకు అండగా మనం పోరాటం చేస్తున్నాం. ప్లేగు లాంటి పితృస్వామిక వ్యవస్థలో హింస నుండి విముక్తికోసం పోరాడి ప్రాణాలు అర్పించడంద్వారా ఎనలేని త్యాగాలుచేసిన మన మహిళా కామ్రేడ్స్ను మహిళా దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఈ వ్యవస్థలో విద్య, వనరుల అందుబాటులోలేని సమాన అవకాశాలు, ఆరోగ్య భద్రతలేని మహిళల సేవలను గుర్తించకపోవడం లాంటి సమస్యలు ఇంకా మిగిలేఉన్నాయి. దేశంలో మహిళల విముక్తి, సమానత్వం, తదితర అంశాలను వ్యతిరేకిస్తున్న శక్తులు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. మహిళలను కేవలం కుల వ్యవస్థకు ప్రతీకలుగా కుదించిన శక్తులు పరిపాలన చేస్తున్నాయి. విలువలకు, స్త్రీ,పురుష సమానత్వంకోసం, స్వేచ్ఛ కోసం డిమాండ్ చేస్తున్న మహిళా ఉద్యమాలను ఈ శక్తులు వ్యతిరేకిస్తున్నాయి.
కొంతకాలం క్రితం సీటెల్ నగరంలో కులవివక్షను నిషేధించాలని కోరుతూ జనం ఓట్లు వేశారు. అన్ని విభాగాలలోనూ మహిళల సంఖ్యను పెంచేందుకు ముసాయిదా బిల్లును స్పెయిన్ ప్రభుత్వం ఆమోదించింది. దీని ద్వారా రాజకీయాలలో, వ్యాపారాలు, వృత్తి సంఘాలు తదితరాలలో మహిళలకు సీట్ల కోటాలను నిర్ణయిస్తారు. ప్రపంచమంతటా అన్ని ప్రభుత్వాలు మహిళలకు సమానత్వం, సామాజిక న్యాయం లభించేవిధంగా ప్రగతిశీల చట్టాలను చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనదేశంలోనూ లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో 33శాతం మహిళలకు రిజర్వేషన్ కావాలన్న బిల్లును బీజేపీ`ఆర్ఎస్ఎస్ పాలనలో ఇంకా తొక్కిపెట్టే ఉంచారు. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించాలని మహిళా ఉద్యమంలో గొప్ప నాయకురాలు కామ్రేడ్ గీతా ముఖర్జీ తన జీవితమంతా పోరాడారు. ఆమె శతజయంతిని ఈ సంవత్సరం మనం నిర్వహించుకున్నాము. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని పోరాడటం ద్వారా గీతా ముఖర్జీ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు పోరాడాలి. పోరాటం ద్వారా గీతా ముఖర్జీని నిజంగా గౌరవించాలి. మహిళా రిజర్వేషన్ చట్టంకోసం ఇంకా పోరాడవలసి ఉంది. దేశనిర్మాణంలో మహిళలు చేస్తున్న కఠినమైన శ్రమను గుర్తించి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలి. అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజన మహిళలు కావచ్చు.. సాంకేతిక కంపెనీలలో పనిచేస్తున్న యువతులు కావచ్చు వీరికి అన్నివిధాలుగా ప్రోత్సాహాన్ని అందించాలి.
రాజ్యాంగ రూపకర్త డా.బిఆర్ అంబేద్కర్ ఇలా చెప్పారు ‘‘పురోగమనమైన మహిళా సమాజానికి చర్యలు తీసుకోవడం ద్వారా కొంతమేరకైనా మహిళలు విజయం సాధించగలిగారు’’. అంబేద్కర్ చెప్పినట్లుగా స్త్రీ,పురుషుల మధ్య సమానత్వం సాధించడానికి పురుషుల ఆధిపత్యాన్ని అంతమొందించడానికి పోరాటం సాగించాలి. మహిళా దినోత్సవం రోజు సమానత్వం, సామరస్యం కోసం పోరాడుతున్న సహచరులందరికీ వందనాలు అర్పిద్దాం. మహిళా ఉద్యమం సాధించిన విజయాలను, పురోగతిని వెనక్కు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను ఓడిరచాలని పార్టీ పిలుపునిస్తోంది.