ఎంకెఆర్
ఆర్ఎస్ఎస్కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చలద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్ కాంతాపురం ఏపి అబూబకర్ ముస్లియార్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ భారత్కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్ పేర్కొన్నది. మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది. భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పిపుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్ ఒక పనిముట్టుగా మారుతున్నది ’’ అని విమర్శించింది. ఆర్ఎస్ఎస్తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్ నేతలు పికె కున్హాలికుట్టి, ఎంకె మునీర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మన దేశంలో ఆర్ఎస్ఎస్కు ఏదీ అసాధ్యం కాదు. కొద్ది వారాలక్రితం దిల్లీలో ఆర్ఎస్ఎస్తో కొన్ని ముస్లిం సంస్థల ప్రతినిధుల సమావేశం ఇప్పుడు కేరళలో వేడిపుట్టిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కేరళపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా అక్కడి సిపిఐ(ఎం) ఫిబ్రవరి 21 నుంచి నెలరోజులు సాగే జాతాను కోజికోడ్లో సిఎం పినరయి విజయన్ ప్రారంభించారు. ఆ సందర్భంగా సిఎం ముస్లింలను బుజ్జగించేందుకు చూసినట్లు బీజేపీ ధ్వజమెత్తింది. అంతకు ముందే ఆర్ఎస్ఎస్తో కేరళకు చెందిన జమాయతే ఇస్లామిక్ హింద్ సంస్థ ప్రతినిధులు దేన్ని గురించి చర్చించారో చెప్పాలంటూ పినరయి విజయన్ లేవనెత్తిన ప్రశ్న వేడిపుట్టించింది. దాన్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఎదురుదాడికి పూనుకుంది. సదరు సమావేశం గురించి ఇంతవరకు ఆర్ఎస్ఎస్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తమంత తాముగా వెళ్లి కలవలేదని ఆర్ఎస్ఎస్ ఆహ్వానం మేరకు వెళ్లినట్లు జమాతే వివరణ ఇచ్చుకుంది. అది వాస్తవం కాదని వార్తలు చెబుతున్నాయి.
జమాతే సంస్థ ప్రధాన కార్యదర్శి టి ఆరిఫ్ జనవరిలో ఆర్ఎస్ఎస్తో జరిపిన చర్చల గురించి వెల్లడిరచారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న మూక దాడులు, వధలు, అట్టడుగు తరగతుల అణచివేతలపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఇది జమాతే వంచన తప్ప మరొకటి కాదని విజయన్ ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ‘‘ఆర్ఎస్ఎస్తో విబేధించే అంశాలున్నప్పటికీ చర్చలు జరపాల్సిఉందని జమాతే చెప్పటం దాని వంచనను వెల్లడిస్తున్నది. ఏమి చర్చించారో, సమావేశం ఏ అంశం మీద జరిగిందో వివరించాలి. జమాతే తర్కం ప్రకారం ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ, చర్చల ద్వారా దాన్ని సంస్కరించవచ్చు, మార్చవచ్చు. ఇదెలా అంటే తోడేలు మచ్చలను నీటితో కడిగి పోగొట్టవచ్చు అన్నట్లుగా ఉంది. భారత్లోని మైనారిటీలు ఉమ్మడిగా ఎదుర్కొంటున్న సమస్యలను దేశ యంత్రాంగాన్ని అదుపుచేస్తున్న ఆర్ఎస్ఎస్ ముందుంచుతామని వాదనచేస్తున్న జమాతేకు అసలు దేశ మైనారిటీల ప్రతినిధిగా ఎవరు అధికారమిచ్చారు? ఏ అంశం గురించి చర్చించినప్పటికీ అది దేశంలోని మైనారిటీలకు సాయపడదు. మైనారిటీల రక్షణఅంటే మతస్వేచ్ఛకు రక్షణ. దాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదెవరో చర్చల్లో పాల్గొన్నవారికి తెలియదా? అలాంటి వారితో చర్చించి లౌకికవాదాన్ని, మైనారిటీలను ఎలా రక్షించగలం? సంఘపరివార్ తీవ్రవాద హిందూత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నేడు దేశంలోని లౌకిక శక్తులు పోరాడు తున్నాయి. ఇటువంటి దశలో అలాంటి చర్చలు ఆర్ఎస్ఎస్ అజండాకు మద్దతు ఇస్తాయి. మతతత్వశక్తులు కుమ్మక్కై ఐక్యంగా లౌకికవాదాన్ని, ప్రజాస్వామిక విలువలను అణచివేస్తున్నాయనేందుకు ఇంతకంటే రుజువు అవసరంలేదు. లౌకిక శక్తులకు ఇదొక సవాలు అని విజయన్ పేర్కొన్నారు. జమాతే వైఖరిని కేరళలోని కేరళ ముస్లిం జమాత్, సమస్త కేరళ జమైతుల్ ఉలేమా, ముస్లింలీగ్, కేరళ నదవతుల్ ముజాహిదీన్, సున్నీ యువజన సంఘం విమర్శించాయి.
ఆర్ఎస్ఎస్కు భయపడి దానితో సఖ్యత కోరుకుంటున్నట్లు, స్వార్ధ ప్రయోజనాలున్నట్లు కొందరు జమాతేను విమర్శించారు. స్నేహపూర్వక చర్చలద్వారా జమాతే చారిత్రక తప్పిదం చేసిందని కేరళ ముస్లిం జమాత్ కాంతాపురం ఏపి అబూబకర్ ముస్లియార్ చెప్పారు. ఆర్ఎస్ఎస్ భారత్కు, దేశ లౌకిక విలువలకు శత్రువని అటువంటి సంస్థతో చర్చలు శత్రువును కౌగలించుకోవటంతో సమానమని ముస్లిం జమాత్ పేర్కొన్నది. మతవాదం ఈ రెండు బృందాలను ముడివేస్తున్నది. భారత వ్యతిరేక ఫాసిస్టు శక్తుల నిజరూపాన్ని కప్పిపుచ్చేందుకు జమాతే ఇస్లామీ హింద్ ఒక పనిముట్టుగా మారుతున్నది ’’ అని విమర్శించింది. ఆర్ఎస్ఎస్తో చర్చించాల్సినంత ప్రత్యేక పరిస్థితులేమీ లేవని ముస్లింలీగ్ నేతలు పికె కున్హాలికుట్టి, ఎంకె మునీర్ పేర్కొన్నారు.
ముస్లిం సంస్థలతో ఆర్ఎస్ఎస్ జరిపిన రహస్య సమావేశం గురించి జనవరి 26న హిందూ పత్రిక వెల్లడిరచింది. సంఘపరివార్ నేతలు ఇంద్రేష్ కుమార్, రామ్లాల్, కృష్ణ గోపాల్ మూడు గంటలపాటు దిల్లీలోని మాజీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ నివాసంలో జరిపిన భేటీలో అనేక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్, జమాతే ఉలేమా ఇ హింద్, అజ్మీర్ దర్గా సల్మాన్ చిస్తీ, తదితరులు ఉన్నారు. గతేడాది ఆగస్టులో ఇలాంటి సమావేశమే జరగ్గా ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్, నజీబ్ జంగ్, మాజీ ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ, ప్రముఖ హోటల్ ఓనరు సయిద్ షెర్వానీ, జర్నలిస్టు షాహిద్ సిద్దికీ, మరికొందరు పాల్గొన్నారు. దాని కొనసాగింపుగా జరిగిన జనవరి సమావేశంలో భగవత్ మినహా మిగిలిన ముస్లింప్రతినిధులంతా పాల్గొన్నట్లు కూడా హిందూపత్రిక పేర్కొన్నది. ఇలాంటి సమావేశాలను తరచూ జరపటంద్వారా సానుకూలసందేశాన్ని పంపటం ముఖ్యమని భాగస్వాములైన ఆర్ఎస్ఎస్ నేతలు భావించారు. ఈ దశలో సంస్థల అధిపతులు, సీనియర్ నేతలు రావటం మంచిది కాదని భావించి, సమావేశాలను తరువాత కూడా కొనసాగించాలని భావించినట్లు వెల్లడిరచింది.
ఆర్ఎస్ఎస్`జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధుల చర్చలు వెల్ఫేర్ పార్టీ బుర్రలోపుట్టిన ఆలోచనకాదా అని సిఎం విజయన్ కోజికోడ్ సభలో విమర్శించారు. కాంగ్రెస్లోని కొంతమంది ఆర్ఎస్ఎస్పై సానుకూల వైఖరితో ఉంటారు. వెల్ఫేర్ పార్టీ, జమాతేపై ముస్లింలీగ్లోని కొందరు అదే విధంగా ఉంటారని అందువలన ఆ మూడుపార్టీలమధ్య ఉన్న ప్రత్యేకబంధం ఏమిటో, చర్చలగురించి జవాబుచెప్పాలని డిమాండ్చేశారు. కేంద్రానికి కేరళ అభివృద్ది పట్టదు, ప్రతిపక్ష కూటమి మౌనంగా ఉంటుంది, కేంద్రం మీద ఒక్క మాట కూడా మాట్లాడదు అన్నారు. ఈ సభలో సిఎం పినరయి విజయన్ ప్రస్తా వించిన మూడుసార్ల తలాక్ అంశంపై బీజేపీి, కొన్ని మీడియాసంస్థలు వక్రీకరణలకు పూనుకున్నాయి. మూడుసార్లు తలాక్చెప్పి భార్యను వదలి వేయటానికి సిపిఎం వ్యతిరేకం అన్నసంగతి తెలిసిందే. అది చెల్లదని సుప్రీంకోర్టు కూడా చెప్పింది కనుక దానిమీద వేరే చట్టం అవసరం లేదన్నది సిపిఎం వైఖరి. అందువలన దానిమీద చట్టంచేసేందుకు ఆర్డినెన్స్జారీని సిపిఎం ఖండిరచింది. తరువాత పార్లమెంటు బిల్లును ఆమోదించింది. దాని ప్రకారం అలా ఎవరైనా విడాకులు తీసుకుంటే మూడు సంవత్సరాలవరకు శిక్ష వేయ వచ్చు. ఇతర మతాలకు చెందిన వారి విడాకుల వివాదాన్ని సివిల్ కేసులుగా పరిగణించి ముస్లింపట్ల క్రిమినల్కేసుగా పరిగణించటాన్ని మాత్రమే సిపిఎం వ్యతిరేకిస్తున్నది తప్ప మూడుసార్ల తలాక్ను సమర్ధించలేదు. సిఎం పినరయి విజయన్ దాన్నే చెప్పారు తప్ప ముస్లింలను సంతృప్తిపరచలేదు.