చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్
విశాలాంధ్ర`కనిగిరి : అకాల వర్షాలకు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం కలవకుండా చూసుకోవాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. గురువారం 11వ వార్డు డ్రైవర్స్ కాలనీలో సమస్యా పరిష్కారంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ అకాల వర్షాలు కారణంగా రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో గుంతలు ఏర్పడి రాకపోకలు స్తంభించి అంతరాయం కలుగుతుందనీ ప్రజలు ఫిర్యాదు చేయడంతో స్పందించి డ్రోజర్ తో మట్టితో గుంతల్ని పూడ్చి రోడ్డును మరమ్మత్తులు చేయించారు. ఓల్టేజి కారణంగా విద్యుత్ సరఫరా అంతరాయం కలుగుతుందని ప్రజలు చెప్పగా నూతన పరివర్తకం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.