పర్చూరు: వాహనదారులు అతివేగంగా ప్రయాణించుట వలన ప్రాణానికి ప్రమాదమని ఇంకొల్లు సిఐ సుబ్బారావు తెలిపారు. శనివారం ఎస్పీ మలికా గర్గ్ ఆదేశాల మేరకు వాహనదారులకు నిబంధనలపై అవగాహన కలిగించారు. ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించి, ముగ్గురు ప్రయాణం చేయరాదని, కారు చోదకులు సీటు బెల్ట్ ధరించాలని తెలిపారు. నిబంధనల ప్రకారం వాహనాలు నడుపుతున్న చోదకులకు గులాబీలు అందించారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధించారు. కార్యక్రమంలో ఎస్సై ఎన్సీ ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గోన్నారు.